ETV Bharat / state

ప్రయాణికులతో కళకళలాడిన గుంటూరు రైల్వేస్టేషన్‌

author img

By

Published : Jun 1, 2020, 6:19 PM IST

రెండు నెలల లాక్​డౌన్​ అనంతరం దేశంలో రైలు ప్రయాణాలు తిరిగి ప్రారంభమయ్యాయి. ప్రయాణికులతో రైల్వే స్టేషన్లు కళ సంతరించుకున్నాయి. ఉదయం గుంటూరు నుంచి సికింద్రాబాద్​కి ఫలక్​నుమా ఎక్స్​ప్రెస్​ బయలుదేరింది. రాత్రి సికింద్రాబాద్ నుంచి గుంటూరు స్టేషన్​కు హౌరా ఎక్స్​ప్రెస్​ చేరనుంది.

ప్రయాణికులతో కళకళలాడిన గుంటూరు స్టేషన్‌
ప్రయాణికులతో కళకళలాడిన గుంటూరు స్టేషన్‌

రెండు నెలల లాక్​డౌన్​ అనంతరం దేశంలో రైలు ప్రయాణాలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఫలితంగా ప్రయాణికులతో రైల్వే స్టేషన్లు కళ సంతరించుకున్నాయి. గుంటూరు నుంచి సికింద్రాబాద్​కి ఉదయం ఫలక్​నుమా ఎక్స్​ప్రెస్​ బయలుదేరింది. సికింద్రాబాద్ నుంచి రాత్రికి హౌరా ఎక్స్​ప్రెస్​ గుంటూరు స్టేషన్​కి చేరనుంది. దీనికి అనుగుణంగా రైల్వే స్టేషన్​లో అవసరమైన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.

ముందస్తుగా ప్రయాణికులను తనిఖీ చేసేందుకు వీలుగా మొదటి ప్లాట్​ ఫామ్​పై ప్రత్యేక గదులను ఏర్పాటుచేశారు. టికెట్లు చేతికి తాకకుండా కంప్యూటర్ సాయంతో స్కాన్​ చేసి రిజర్వేషన్ సదుపాయం ఉన్న వారిని స్టేషన్​ లోపలికి అనుమతిస్తున్నారు. రైలు బయల్దేరే సమయానికి కనీసం గంట ముందే స్టేషన్​కు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రయాణికులు అందరూ తప్పనిసరిగా మాస్క్​లు ధరించాలని పేర్కొన్నారు. స్క్రీనింగ్ పరీక్ష అనంతరం లోపలికి అనుమతిస్తున్నారు. భౌతిక దూరం పాటిస్తూ వారికి కేటాయించిన ప్రాంతాల్లో వేచి ఉండే విధంగా రైల్వే రక్షక దళం పర్యవేక్షిస్తున్నారు. శానిటైజర్​తో చేతులు శుభ్రం చేసుకునేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఇదీ చూడండి: విజయవాడ నుంచి 14 రైళ్ల రాకపోకలు

రెండు నెలల లాక్​డౌన్​ అనంతరం దేశంలో రైలు ప్రయాణాలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఫలితంగా ప్రయాణికులతో రైల్వే స్టేషన్లు కళ సంతరించుకున్నాయి. గుంటూరు నుంచి సికింద్రాబాద్​కి ఉదయం ఫలక్​నుమా ఎక్స్​ప్రెస్​ బయలుదేరింది. సికింద్రాబాద్ నుంచి రాత్రికి హౌరా ఎక్స్​ప్రెస్​ గుంటూరు స్టేషన్​కి చేరనుంది. దీనికి అనుగుణంగా రైల్వే స్టేషన్​లో అవసరమైన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.

ముందస్తుగా ప్రయాణికులను తనిఖీ చేసేందుకు వీలుగా మొదటి ప్లాట్​ ఫామ్​పై ప్రత్యేక గదులను ఏర్పాటుచేశారు. టికెట్లు చేతికి తాకకుండా కంప్యూటర్ సాయంతో స్కాన్​ చేసి రిజర్వేషన్ సదుపాయం ఉన్న వారిని స్టేషన్​ లోపలికి అనుమతిస్తున్నారు. రైలు బయల్దేరే సమయానికి కనీసం గంట ముందే స్టేషన్​కు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రయాణికులు అందరూ తప్పనిసరిగా మాస్క్​లు ధరించాలని పేర్కొన్నారు. స్క్రీనింగ్ పరీక్ష అనంతరం లోపలికి అనుమతిస్తున్నారు. భౌతిక దూరం పాటిస్తూ వారికి కేటాయించిన ప్రాంతాల్లో వేచి ఉండే విధంగా రైల్వే రక్షక దళం పర్యవేక్షిస్తున్నారు. శానిటైజర్​తో చేతులు శుభ్రం చేసుకునేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఇదీ చూడండి: విజయవాడ నుంచి 14 రైళ్ల రాకపోకలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.