ETV Bharat / state

రేపల్లె, నిజాంపట్నం మండలాల్లో రెండు కరోనా కేసులు నమోదు

గుంటూరు జిల్లా రేపల్లె, నిజాంపట్నం మండలంలో కొత్తగా రెండు కరోనా పాజిటివ్​ కేసులు నమోదవ్వడం వల్ల అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ ప్రాంతాలను రెడ్​ జోన్​గా ప్రకటించి ప్రజలు బయటకు రాకుండా నిత్యావసర సరుకులు ఇంటి వద్దకే అందజేశారు.

author img

By

Published : Jul 9, 2020, 7:41 PM IST

two positive cases found in repalle and nijampatnam in guntur district
రెండు కరోనా కేసులు నమోదు

గుంటూరు జిల్లా రేపల్లె, నిజాంపట్నం మండలాల్లో రెండు కరోనా కేసులు నమోదయ్యాయి. అధికారులు అప్రమత్తమై ఆ ప్రాంతాలను రెడ్​ జోన్లుగా ప్రకటించారు. అన్ని రకాల షాపులను మూసివేశారు. ప్రజలు నిత్యావసరాల కోసం బయటకు రాకుండా ఇంటి వద్దకే సరుకులు అందించే ఏర్పాట్లు చేశారు. రెడ్​ జోన్​లోని అన్ని ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్మికులు శానిటైజింగ్​ చేశారు. ఈ కేసులతో కలిపి ఇప్పటి వరకు నియోజకవర్గంలో కొవిడ్​ కేసుల సంఖ్య 18కి చేరాయి. వీరిలో నలుగురు కోలుకున్నారు.

గుంటూరు జిల్లా రేపల్లె, నిజాంపట్నం మండలాల్లో రెండు కరోనా కేసులు నమోదయ్యాయి. అధికారులు అప్రమత్తమై ఆ ప్రాంతాలను రెడ్​ జోన్లుగా ప్రకటించారు. అన్ని రకాల షాపులను మూసివేశారు. ప్రజలు నిత్యావసరాల కోసం బయటకు రాకుండా ఇంటి వద్దకే సరుకులు అందించే ఏర్పాట్లు చేశారు. రెడ్​ జోన్​లోని అన్ని ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్మికులు శానిటైజింగ్​ చేశారు. ఈ కేసులతో కలిపి ఇప్పటి వరకు నియోజకవర్గంలో కొవిడ్​ కేసుల సంఖ్య 18కి చేరాయి. వీరిలో నలుగురు కోలుకున్నారు.

ఇదీ చదవండి : పోలీసు హెచ్చరిక: కొవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా, కేసు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.