పిడుగురాళ్లలోని జన్మత్ మసీదుకు వచ్చేవారిలో కొంతకాలంగా చీలికలు వచ్చాయి. స్థానికంగా కూడా పొరపచ్చాలు ఏర్పడి కొద్దిరోజులుగా మసీదులో ఆధిపత్య పోరు కొనసాగుతోంది. తాజాగా ఆదివారం ప్రార్థన సమయంలో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసాయి. సుమారు 10మంది గాయపడ్డారు. వారిని సత్తెనపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇదీచూడండి.కన్నుల పండుగగా శ్రీవారి కల్యాణం