ETV Bharat / state

గుప్త నిధుల కోసం.. పురాతన ఆలయాల్లో విగ్రహాలు ధ్వంసం

author img

By

Published : Apr 4, 2023, 2:21 PM IST

Theft of idols in ancient temples: గుంటూరు జిల్లాలోని ఓ ఆలయంలో పురాతన వినాయకుడి విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై బీజీపీ నేతలు ఆందోళనకు పిలుపునిచ్చారు. మరోవైపు సత్యసాయి జిల్లాలోని పురాతన ఆలయంలో నంది విగ్రహాన్ని ముగ్గురు దుండగులు దోచుకెళ్లారు. అసలేం జరిగిందంటే?..

theft in temple
theft in temple

Theft of idols in ancient temples: గుంటూరు జిల్లాలోని పిరంగిపురం మండలంలో గుర్తు తెలియని దుండగులు పురాతన వినాయకుడి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. హౌస్ గణేష్ గ్రామం శివారు పొలాల్లో కొండపై ఆలయంలో ఈ వినాయకుడి రాతి విగ్రహం ఉంది. అయితే ఆ ఆలయంలో వినాయకుడి విగ్రం పగలగొట్టి ఉంది. ఈ విషయాన్ని స్థానికులు సోమవారం మధ్యాహ్నం గుర్తించారు. దీంతో ఎవరో గుర్తు తెలియని దుండగులు ఆదివారం రాత్రి ఈ ఘటనకు పాల్పడి ఉండవచ్చునని భావిస్తున్నారు. కాగా.. ఈ విగ్రహం 500 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసినట్లు స్థానికులు తెలిపారు.

రాతి విగ్రహం పొట్ట భాగంలో గుప్త నిధులు ఉంటాయనే ఉద్దేశంతోనే దుండగులు ఈ దాడికి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. ఈ ఘటనపై ఆలయ కమిటీ సభ్యులు ఫిరంగిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, రెవెన్యూ అధికారులు విగ్రహాన్ని పరిశీలించారు. కాగా.. వినాయకుడి విగ్రహ ధ్వంసంపై ఆందోళనకు బీజేపీ పిలుపునిచ్చింది. దీంతో స్థానిక బీజేపీ నేతలు హౌస్ గణేష్​పాడుకు బయల్దేరారు.

మరోవైపు శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలోనూ దుండగులు రెచ్చిపోయారు. అతి పురాతన ఆలయంలో నంది విగ్రహాన్ని దోచుకెళ్లారు. సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హిందూపురంలోని అతి పురాతన అనంత పద్మనాభ స్వామి ఆలయ ప్రాంగణంలో చంద్రమౌళీశ్వరుడి ముందు నంది విగ్రహం ఉంది. కాగా.. ముగ్గురు దుండగులు సోమవారం రాత్రి.. ఆలయం వెనుకవైపు నుంచి లోపలికి ప్రవేశించి నంది విగ్రహాన్ని పెకిలించి దోచుకెళ్లారు.

ఈ ఘటనపై ఆలయ ఈవో ప్రధాన అర్చకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందిన వెంటనే హిందూపురం టూ టౌన్ పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే దుండగులు ఆలయంలో విలువైన సామగ్రిని ముట్టుకోకుండా.. కేవలం నంది విగ్రహాన్ని మాత్రమే పెకిలించి దోచుకెళ్లడంతో ఈ ఘటన పలు అనుమానాలకు దారి తీస్తోంది. పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు.

ఇవీ చదవండి:

Theft of idols in ancient temples: గుంటూరు జిల్లాలోని పిరంగిపురం మండలంలో గుర్తు తెలియని దుండగులు పురాతన వినాయకుడి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. హౌస్ గణేష్ గ్రామం శివారు పొలాల్లో కొండపై ఆలయంలో ఈ వినాయకుడి రాతి విగ్రహం ఉంది. అయితే ఆ ఆలయంలో వినాయకుడి విగ్రం పగలగొట్టి ఉంది. ఈ విషయాన్ని స్థానికులు సోమవారం మధ్యాహ్నం గుర్తించారు. దీంతో ఎవరో గుర్తు తెలియని దుండగులు ఆదివారం రాత్రి ఈ ఘటనకు పాల్పడి ఉండవచ్చునని భావిస్తున్నారు. కాగా.. ఈ విగ్రహం 500 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసినట్లు స్థానికులు తెలిపారు.

రాతి విగ్రహం పొట్ట భాగంలో గుప్త నిధులు ఉంటాయనే ఉద్దేశంతోనే దుండగులు ఈ దాడికి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. ఈ ఘటనపై ఆలయ కమిటీ సభ్యులు ఫిరంగిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, రెవెన్యూ అధికారులు విగ్రహాన్ని పరిశీలించారు. కాగా.. వినాయకుడి విగ్రహ ధ్వంసంపై ఆందోళనకు బీజేపీ పిలుపునిచ్చింది. దీంతో స్థానిక బీజేపీ నేతలు హౌస్ గణేష్​పాడుకు బయల్దేరారు.

మరోవైపు శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలోనూ దుండగులు రెచ్చిపోయారు. అతి పురాతన ఆలయంలో నంది విగ్రహాన్ని దోచుకెళ్లారు. సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హిందూపురంలోని అతి పురాతన అనంత పద్మనాభ స్వామి ఆలయ ప్రాంగణంలో చంద్రమౌళీశ్వరుడి ముందు నంది విగ్రహం ఉంది. కాగా.. ముగ్గురు దుండగులు సోమవారం రాత్రి.. ఆలయం వెనుకవైపు నుంచి లోపలికి ప్రవేశించి నంది విగ్రహాన్ని పెకిలించి దోచుకెళ్లారు.

ఈ ఘటనపై ఆలయ ఈవో ప్రధాన అర్చకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందిన వెంటనే హిందూపురం టూ టౌన్ పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే దుండగులు ఆలయంలో విలువైన సామగ్రిని ముట్టుకోకుండా.. కేవలం నంది విగ్రహాన్ని మాత్రమే పెకిలించి దోచుకెళ్లడంతో ఈ ఘటన పలు అనుమానాలకు దారి తీస్తోంది. పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.