ETV Bharat / state

విద్యార్థులతో మట్టి మోయించిన ఉపాధ్యాయులు

పాఠశాల విద్యార్థులతో ఉపాధ్యాయులు మట్టి మోయించిన ఘటన క్రోసూరు మండంలో జరిగింది. స్థానికులు.. ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

author img

By

Published : Aug 10, 2021, 3:46 PM IST

teachers-carrying-mud-with-students
teachers-carrying-mud-with-students
విద్యార్థులతో మట్టి మోయించిన ఉపాధ్యాయులు

గుంటూరు జిల్లా క్రోసూరు మండలం దొడ్లేరు గ్రామంలోని మండల పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయులే స్వయంగా విద్యార్థులతో మట్టి పనులు చేయించారు. మంగళవారం ఉదయం పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయులు.. విద్యార్థులను పిలిపించారు. వారికి తట్టలు, పారలు ఇచ్చి మట్టి తవ్వించి మోయించారు.

విద్యా బుద్ధులు నేర్పాల్సిన ఉపాద్యాయులే విద్యార్థులతో చాకిరీ చేయించడంపై.. స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ ఘటనకు కారకులైన ఉపాధ్యాయులను తక్షణమే గుర్తించి.. వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

'జగనన్న ఇల్లు' మంజూరయిందని.. మహిళ నుంచి డబ్బు వసూలు చేసిన బిల్డర్​!

విద్యార్థులతో మట్టి మోయించిన ఉపాధ్యాయులు

గుంటూరు జిల్లా క్రోసూరు మండలం దొడ్లేరు గ్రామంలోని మండల పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయులే స్వయంగా విద్యార్థులతో మట్టి పనులు చేయించారు. మంగళవారం ఉదయం పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయులు.. విద్యార్థులను పిలిపించారు. వారికి తట్టలు, పారలు ఇచ్చి మట్టి తవ్వించి మోయించారు.

విద్యా బుద్ధులు నేర్పాల్సిన ఉపాద్యాయులే విద్యార్థులతో చాకిరీ చేయించడంపై.. స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ ఘటనకు కారకులైన ఉపాధ్యాయులను తక్షణమే గుర్తించి.. వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

'జగనన్న ఇల్లు' మంజూరయిందని.. మహిళ నుంచి డబ్బు వసూలు చేసిన బిల్డర్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.