ETV Bharat / state

భద్రత కుదింపు కక్ష సాధింపు చర్యే: తెదేపా

ప్రతిపక్ష నేత చంద్రబాబుతో సహా ఆయన కుటుంబ సభ్యులకు భద్రత తగ్గించడాన్ని తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. నారా లోకేష్‌కు భద్రతను జడ్ కేటగిరీ నుంచి వై ప్లస్‌కు కుదించడం, భువనేశ్వరి, బ్రాహ్మణికి భద్రత పూర్తిగా తొలగించడం కక్ష సాధింపేనని నేతలు మండిపడ్డారు.

author img

By

Published : Jun 25, 2019, 3:22 PM IST

Updated : Jun 25, 2019, 3:41 PM IST

tdp meeting

అమరావతిలోని చంద్రబాబు నివాసంలో తెదేపా నేతలు సమావేశమై తాజా పరిణామాలపై చర్చించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఆయన భార్య విజయమ్మ, కుమార్తె షర్మిలకు భద్రత తగ్గించాలని భద్రత సమీక్ష కమిటీ అభిప్రాయపడినప్పటికీ, అప్పటి సీఎం చంద్రబాబు అందుకు తిరస్కరించి.. వారి భద్రత ప్రభుత్వ బాధ్యతగా పేర్కొన్నారనే విషయాన్ని నేతలు ప్రస్తావించారు. కక్ష సాధింపు చర్యలో భాగంగానే చంద్రబాబు కుటుంబ సభ్యులకు భద్రత తగ్గించారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాధనంతో నిర్మించిన ప్రజావేదిక కూలగొట్టడం సరైన చర్యకాదని నేతలు అభిప్రాయపడ్డారు. అక్రమ నిర్మాణాలుగా జగన్ పేర్కొంటున్న కరకట్ట లోపలి భవనాల్లో అధిక భాగం ఉడా ఛైర్మన్‌గా మల్లాది విష్ణు, సీఎంగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే నిర్మించిన విషయం సీఎంకు గుర్తులేదా అని ప్రశ్నించారు. విత్తనాల కొరతతో రైతులు పడుతున్న ఇబ్బందులను వెంటనే పరిష్కరించాలని తెదేపా నేతలు డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా చినగంజాం మండలం రుద్రమాంబపురంలో తెదేపా శ్రేణులపై వైకాపా నేతల దాడిని నేతలు ఖండించారు. తెదేపా ప్రతినిధి బృందం గ్రామంలో పర్యటించి ఆత్మహత్య చేసుకున్న పద్మ కుటుంబానికి అండగా ఉండాలని నిర్ణయించారు.

అమరావతిలోని చంద్రబాబు నివాసంలో తెదేపా నేతలు సమావేశమై తాజా పరిణామాలపై చర్చించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఆయన భార్య విజయమ్మ, కుమార్తె షర్మిలకు భద్రత తగ్గించాలని భద్రత సమీక్ష కమిటీ అభిప్రాయపడినప్పటికీ, అప్పటి సీఎం చంద్రబాబు అందుకు తిరస్కరించి.. వారి భద్రత ప్రభుత్వ బాధ్యతగా పేర్కొన్నారనే విషయాన్ని నేతలు ప్రస్తావించారు. కక్ష సాధింపు చర్యలో భాగంగానే చంద్రబాబు కుటుంబ సభ్యులకు భద్రత తగ్గించారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాధనంతో నిర్మించిన ప్రజావేదిక కూలగొట్టడం సరైన చర్యకాదని నేతలు అభిప్రాయపడ్డారు. అక్రమ నిర్మాణాలుగా జగన్ పేర్కొంటున్న కరకట్ట లోపలి భవనాల్లో అధిక భాగం ఉడా ఛైర్మన్‌గా మల్లాది విష్ణు, సీఎంగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే నిర్మించిన విషయం సీఎంకు గుర్తులేదా అని ప్రశ్నించారు. విత్తనాల కొరతతో రైతులు పడుతున్న ఇబ్బందులను వెంటనే పరిష్కరించాలని తెదేపా నేతలు డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా చినగంజాం మండలం రుద్రమాంబపురంలో తెదేపా శ్రేణులపై వైకాపా నేతల దాడిని నేతలు ఖండించారు. తెదేపా ప్రతినిధి బృందం గ్రామంలో పర్యటించి ఆత్మహత్య చేసుకున్న పద్మ కుటుంబానికి అండగా ఉండాలని నిర్ణయించారు.

Intro:శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండల విద్యాశాఖ కార్యాలయంలో నిర్వహించిన రాజన్న బడిబాట కార్యక్రమంలో సభాపతి తమ్మినేని సీతారాం పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజన్న బడిబాట కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి అధికారులు కృషి చేయాలని ఆదేశించారు మండలంలోని మూతబడిన పాఠశాలను తెరిపించాలని సూచించారు ఆమదాలవలస మండలం లో ప్రభుత్వ పనితీరుపై చర్చించారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇ వైఎస్ జగన్మోహన్ రెడ్డి e విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని ప్రతి గ్రామంలో లో మూతబడిన ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని జిల్లా అధికారులకు ఆదేశించారు ప్రభుత్వ పాఠశాల లో లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని అన్నారు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మంచి రుచికరమైన భోజనం బూట్లు సాక్షులు పుస్తకాలు తో పాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని విద్యాశాఖ అధికారులు గ్రామాల్లో పర్యటించి ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు చదివే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు మండలంలోని మూతపడిన 13 పాఠశాలను తక్షణమే తెరిపించాలని అధికారులను ఆదేశించారు ఈ సమావేశంలో లో మండల ప్రత్యేక అధికారి రాదా ఎంపీడీవో హరిప్రసాద్ ఎంఈఓ చంద్రశేఖర్ ర్ తాసిల్దార్ కె వి వి శివ తో పాటు అధికారులు పాల్గొన్నారు.8008574248.


Body:రాజన్న బడిబాట పై సమీక్ష


Conclusion:8008574248
Last Updated : Jun 25, 2019, 3:41 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.