ETV Bharat / state

వైకాపా నేతలు ఇసుక దోపిడీకి యత్నిస్తున్నారు: తెనాలి శ్రావణ్ - వైకాపా నేతలపై గుంటూరులో శ్రావణ్ కుమార్ ఆరోపణలు

ఇసుక తవ్వకాలు అడ్డంపెట్టుకుని వైకాపా నేతలు దోపిడీకి పాల్పడాలని చూస్తున్నారని.. గుంటూరు తెదేపా పార్లమెంట్ అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ ఆరోపించారు. విశాఖ ఉక్కు కర్మాగారం విషయంలోనూ కేంద్రంతో కుమ్మక్కై.. పరిశ్రమను ప్రైవేటుపరం చేయాలని ప్రయత్నిస్తున్నారంటూ పార్టీ కార్యాలయంలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

tdp leader sravan kumar allegations inguntur on ycp government
వైకాపా ప్రభుత్వంపై గుంటూరులో తెదేపా నేత తెనాలి శ్రావణ్ కుమార్ ఆరోపణలు
author img

By

Published : Mar 24, 2021, 3:49 PM IST

వైకాపా ఎమ్మెల్యేలు, మంత్రులు దోచుకునేందుకే.. దివాలా తీసిన కంపెనీకి ఇసుక తవ్వకాల బాధ్యత అప్పగించారని గుంటూరు తెదేపా పార్లమెంట్ అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ విమర్శించారు. గతంలో సూట్​కేస్ కంపెనీలు పెట్టి వేల కోట్లు కొల్లగొట్టిన చరిత్ర సీఎం జగన్​కు ఉందని పార్టీ కార్యాలయంలో విమర్శించారు. ఇపుడు ఇసుకనూ అదే తరహాలో దోపిడీ చేయడానికి యత్నిస్తున్నారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన 21నెలల్లో.. మూడుసార్లు ఇసుక పాలసీ మార్చిన ఘనత వైకాపా ప్రభుత్వానిదేనని ఎద్దేవా చేశారు.

పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచులకు అధికారాలు అప్పగించడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందంటూ శ్రావణ్ కుమార్ మండిపడ్డారు. కేంద్రంతో కుమ్మక్కై.. ప్రైవేట్ సంస్థలకు విశాఖ ఉక్కుని అప్పగించేందుకు సీఎం జగన్ సర్కారు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ విషయంలో తమకు సంబంధం లేదని ప్రజల్ని మభ్యపెడుతున్నారని విమర్శించారు. పరిశ్రమను కాపాడుకునేందుకు ఈనెల 26న జరగనున్న బంద్​లో తెదేపా శ్రేణులు పాల్గొంటాయని తెలిపారు. అనంతరం స్థానిక ఎంపీ గల్లా జయదేవ్ పుట్టినరోజు సందర్భంగా.. పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేశారు.

వైకాపా ఎమ్మెల్యేలు, మంత్రులు దోచుకునేందుకే.. దివాలా తీసిన కంపెనీకి ఇసుక తవ్వకాల బాధ్యత అప్పగించారని గుంటూరు తెదేపా పార్లమెంట్ అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ విమర్శించారు. గతంలో సూట్​కేస్ కంపెనీలు పెట్టి వేల కోట్లు కొల్లగొట్టిన చరిత్ర సీఎం జగన్​కు ఉందని పార్టీ కార్యాలయంలో విమర్శించారు. ఇపుడు ఇసుకనూ అదే తరహాలో దోపిడీ చేయడానికి యత్నిస్తున్నారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన 21నెలల్లో.. మూడుసార్లు ఇసుక పాలసీ మార్చిన ఘనత వైకాపా ప్రభుత్వానిదేనని ఎద్దేవా చేశారు.

పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచులకు అధికారాలు అప్పగించడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందంటూ శ్రావణ్ కుమార్ మండిపడ్డారు. కేంద్రంతో కుమ్మక్కై.. ప్రైవేట్ సంస్థలకు విశాఖ ఉక్కుని అప్పగించేందుకు సీఎం జగన్ సర్కారు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ విషయంలో తమకు సంబంధం లేదని ప్రజల్ని మభ్యపెడుతున్నారని విమర్శించారు. పరిశ్రమను కాపాడుకునేందుకు ఈనెల 26న జరగనున్న బంద్​లో తెదేపా శ్రేణులు పాల్గొంటాయని తెలిపారు. అనంతరం స్థానిక ఎంపీ గల్లా జయదేవ్ పుట్టినరోజు సందర్భంగా.. పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేశారు.

ఇదీ చదవండి:

వ్యవసాయ శాఖ ఇన్​ఛార్జి కమిషనర్​గా.. శేఖర్​ బాబు బాధ్యతలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.