ETV Bharat / state

యూనిఫాం ధరించలేదని ప్రిన్సిపాల్ మందలింపు: విద్యార్థి ఆత్మహత్య - suicide news in guntur

యూనిఫామ్ ధరించకుండా పాఠశాలకు వచ్చిన విద్యార్థిని... ప్రిన్సిపాల్ మందలించాడు. అది తట్టుకోలేక 9వ తరగతి బాలుడు ఆత్మహత్మ చేసుకున్న ఘటన గుంటూరు నేతాజీనగర్​లో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

యూనిఫాం ధరించలేదని ప్రిన్సిపాల్ మందలించటంతో విద్యార్థి ఆత్మహత్య
యూనిఫాం ధరించలేదని ప్రిన్సిపాల్ మందలించటంతో విద్యార్థి ఆత్మహత్య
author img

By

Published : Jan 28, 2021, 5:40 PM IST

Updated : Jan 28, 2021, 7:20 PM IST

యూనిఫాం ధరించలేదని ప్రిన్సిపాల్ మందలింపు: విద్యార్థి ఆత్మహత్య

ప్రిన్సిపాల్ మందలించాడని తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన గుంటూరులో కలకలం రేపింది. నేతాజీనగర్‌కు చెందిన వెంకట సాంబశివరావు పలకలూరు రోడ్డులోని గ్రీన్‌ల్యాండ్ పబ్లిక్ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. బుధవారం స్కూల్​కి యూనిఫాం ధరించకుండా వెళ్లిన సాంబశివరావుని... విద్యార్థుల ముందు యునిఫాం ఎందుకు వేసుకురాలేదని ప్రిన్సిపాల్ ప్రశ్నించారు. మనస్తాపానికి గురైన విద్యార్థి తమ ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తండ్రి శ్రీనివాసరావు కుమారుడ్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందాడు.

మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం గుంటూరు శవాగారానికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తన కుమారుడు ప్రిన్సిపాల్ వలన ఆత్మహత్య చేసుకున్నాడని తండ్రి శ్రీనివాసరావు ఆరోపించారు. గతంలోనూ పాఠశాల ఫీజు చెల్లించడంలో ఆలస్యమైనప్పుడు ఇలానే తన కుమారుడిని వేధించాడని చెప్పారు. తన కుమారుడు మృతికి కారణమైన ప్రిన్సిపాల్​పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి

మంగళగిరిలో ప్రభుత్వ స్థలాలను ఖాళీగా ఉంచొద్దు: ఎమ్మెల్యే

యూనిఫాం ధరించలేదని ప్రిన్సిపాల్ మందలింపు: విద్యార్థి ఆత్మహత్య

ప్రిన్సిపాల్ మందలించాడని తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన గుంటూరులో కలకలం రేపింది. నేతాజీనగర్‌కు చెందిన వెంకట సాంబశివరావు పలకలూరు రోడ్డులోని గ్రీన్‌ల్యాండ్ పబ్లిక్ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. బుధవారం స్కూల్​కి యూనిఫాం ధరించకుండా వెళ్లిన సాంబశివరావుని... విద్యార్థుల ముందు యునిఫాం ఎందుకు వేసుకురాలేదని ప్రిన్సిపాల్ ప్రశ్నించారు. మనస్తాపానికి గురైన విద్యార్థి తమ ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తండ్రి శ్రీనివాసరావు కుమారుడ్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందాడు.

మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం గుంటూరు శవాగారానికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తన కుమారుడు ప్రిన్సిపాల్ వలన ఆత్మహత్య చేసుకున్నాడని తండ్రి శ్రీనివాసరావు ఆరోపించారు. గతంలోనూ పాఠశాల ఫీజు చెల్లించడంలో ఆలస్యమైనప్పుడు ఇలానే తన కుమారుడిని వేధించాడని చెప్పారు. తన కుమారుడు మృతికి కారణమైన ప్రిన్సిపాల్​పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి

మంగళగిరిలో ప్రభుత్వ స్థలాలను ఖాళీగా ఉంచొద్దు: ఎమ్మెల్యే

Last Updated : Jan 28, 2021, 7:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.