ETV Bharat / state

ఘనంగా గుండు రాయి ఎత్తు పోటీలు

author img

By

Published : Jan 16, 2021, 2:28 PM IST

గుంటూరు జిల్లాలో గుండు రాయి ఎత్తు పోటీలు ఘనంగా జరిగాయి. 102 కేజీల విభాగంలో పలువురు పోటీ పడగా.. ముగ్గురిని విజేతలుగా ప్రకటించారు. మొదటి స్థానంలో నిలిచిన వ్యక్తి కేవలం 5 నిమిషాల్లో 36 సార్లు గుండు రాయి పైకెత్తి అందిరినీ ఆశ్చర్య పరిచాడు.

stone lifting race in phirangipuram
గుండు రాయి ఎత్తు పోటీలు

సంక్రాంతి సంబురాల్లో భాగంగా గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం వేములురిపాడులో గుండు రాయి ఎత్తుడు పోటీలు ఉత్కంఠ భరితంగా సాగాయి. 102 కేజీల బరువు గల గుండు రాయిని పొన్నూరు మండలం ఉప్పారపాలెం గ్రామానికి చెందిన ముద్రబోయిన గోపి 5 నిమిషాల్లో 36 సార్లు పైకెత్తి ప్రథమ స్థానంలో నిలిచారు.

నరసరావుపేట మండలం పమిడిపాడు గ్రామానికి చెందిన మదం వీరాంజినీయులు ద్వితీయ స్థానం (29 సార్లు), పమిగిపాడు వాసి మేకల రవీంద్ర మూడో స్థానం (24 సార్లు)లో నిలిచారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.

సంక్రాంతి సంబురాల్లో భాగంగా గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం వేములురిపాడులో గుండు రాయి ఎత్తుడు పోటీలు ఉత్కంఠ భరితంగా సాగాయి. 102 కేజీల బరువు గల గుండు రాయిని పొన్నూరు మండలం ఉప్పారపాలెం గ్రామానికి చెందిన ముద్రబోయిన గోపి 5 నిమిషాల్లో 36 సార్లు పైకెత్తి ప్రథమ స్థానంలో నిలిచారు.

నరసరావుపేట మండలం పమిడిపాడు గ్రామానికి చెందిన మదం వీరాంజినీయులు ద్వితీయ స్థానం (29 సార్లు), పమిగిపాడు వాసి మేకల రవీంద్ర మూడో స్థానం (24 సార్లు)లో నిలిచారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.

ఇదీ చదవండి:

రాష్ట్ర వ్యాప్తంగా... కనువిందుగా కనుమ వేడుక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.