ETV Bharat / state

'దగా చేసేందుకే చంద్రబాబు మళ్లీ అవకాశమివ్వమంటున్నారు'

ఈ ఎన్నికలు మంచికి, చెడుకి మధ్య జరుగుతున్నాయి. ప్రజలందరూ మంచి వైపు నిలబడాలి. రాజన్నను మనసులో తలచుకుని ఫ్యాను గుర్తుకి ఓటేయాలి: ప్రచారంలో షర్మిల

author img

By

Published : Mar 31, 2019, 4:50 AM IST

షర్మిల
షర్మిల బస్సు 'యాత్ర'
ఐదేళ్లుగా ప్రజలను పట్టించుకోని చంద్రబాబు... ఇప్పుడు మరోసారి దగా చేయడానికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారని ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ సోదరి షర్మిల విమర్శించారు. శుక్రవారం బస్సు యాత్ర ప్రారంభించిన షర్మిల... శనివారం గుంటూరు నగరంపాలెం సెంటర్ నుండి గుజ్జనగుండ్ల ప్రధాన కూడలి వరకు రోడ్ షో నిర్వహించారు. ఇప్పుడు జరగపోయే ఎన్నికలు మంచికి చెడుకు జరుగుతున్న ఎన్నికలని ...ప్రజలందరూ మంచి వైపే నిలవాలని కోరారు. తమకు ఏ పార్టీతోనూ పొత్తులు లేవని...ఒక్కసారి రాజన్నను మనసులో తలచుకుని ఫ్యాను గుర్తుకు ఓటేయాలని కోరారు. తమ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి షేక్‌ మహమ్మద్‌ ముస్తఫా, చంద్రగిరి ఏసురత్నం, ఎంపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు షర్మిల విన్నవించారు.

షర్మిల బస్సు 'యాత్ర'
ఐదేళ్లుగా ప్రజలను పట్టించుకోని చంద్రబాబు... ఇప్పుడు మరోసారి దగా చేయడానికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారని ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ సోదరి షర్మిల విమర్శించారు. శుక్రవారం బస్సు యాత్ర ప్రారంభించిన షర్మిల... శనివారం గుంటూరు నగరంపాలెం సెంటర్ నుండి గుజ్జనగుండ్ల ప్రధాన కూడలి వరకు రోడ్ షో నిర్వహించారు. ఇప్పుడు జరగపోయే ఎన్నికలు మంచికి చెడుకు జరుగుతున్న ఎన్నికలని ...ప్రజలందరూ మంచి వైపే నిలవాలని కోరారు. తమకు ఏ పార్టీతోనూ పొత్తులు లేవని...ఒక్కసారి రాజన్నను మనసులో తలచుకుని ఫ్యాను గుర్తుకు ఓటేయాలని కోరారు. తమ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి షేక్‌ మహమ్మద్‌ ముస్తఫా, చంద్రగిరి ఏసురత్నం, ఎంపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు షర్మిల విన్నవించారు.
sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.