గుంటూరు జిల్లా అమరావతి మండలం ధరణికోట గ్రామంలో.. ఉపసర్పంచ్ ఎన్నిక గందరగోళానికి దారి తీసింది. అధికారులు పంచాయితీ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులకు ఉప సర్పంచి ఎన్నిక నిర్వహించడానికి నోటీసులు ఇచ్చారు. తెదేపా నుంచి గెలిచిన 9 మంది వార్డు సభ్యులు, ఐదుగురు వైకాపా వార్డు సభ్యులు పంచాయతీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అమరావతి తహసీల్దార్ శ్రీనివాస్ రావు అక్కడికి చేరుకుని వార్డు సభ్యులతో సమావేశమయ్యారు. ఉప సర్పంచి ఎన్నిక జరగాల్సి ఉన్నపటికీ వైకాపా నేతలు రంగప్రవేశం చేశారు. నేతల ఒత్తిడి మేరకు తనకు అనారోగ్యంగా ఉందని చెప్పి.. తహసీల్దార్ పంచాయితీ కార్యాలయం వద్దకు ఆంబులెన్సును పిలిచారు. తెదేపా తరపు వార్డు సభ్యులు ఆయనను అడ్డుకున్నారు. ఎన్నిక నిర్వహించాల్సిందేనని పట్టుబట్టారు.
పోలీసులు అక్కడికి చేరుకొని వార్డు సభ్యులను లాఠీఛార్జ్ చేసి చెదరగొట్టారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కోరం లేదని ఉప సర్పంచ్ ఎన్నికను.. తహశీల్దార్ వాయిదా వేయడాన్ని నిరసిస్తూ తెదేపా నేతలు ఆందోళన చేపట్టారు.
ఇదీ చదవండి: