ETV Bharat / state

మున్సిపాలిటీ స్థలంలో వెలసిన గుడారాలు

గుంటూరు జిల్లా లింగంగుంట్ల వద్ద పురపాలిక స్థలంలో కొందరు పేదలు గుడారాలు ఏర్పాటు చేశారు. వీరికి పట్టణ నిరుపేద సంఘం, బీఎస్పీ నేతలు మద్దుతు పలికారు.

author img

By

Published : Aug 2, 2019, 9:38 AM IST

అక్రమ గుడారాలు
మున్సిపాలిటీ స్థలంలో వెలసిన గుడారాలు

గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం లింగంగుంట్ల వద్ద పురపాలక స్థలంలో కొందరు గుడారాలు వేశారు. పట్టణ నిరుపేద సంఘం, బహుజన సమాజ్​వాదీ పార్టీ నేతల ఆధ్వర్యంలో సుమారు వంద కుటుంబాలు అక్రమంగా గుడారాలు ఏర్పాటు చేశారు. గతంలో ఇదే పని చేసినప్పుడు అప్పటి ఆర్డీఓ, డీఎస్పీ ఆక్రమణదారులతో చర్చించి సమస్యను పరిష్కరించారు. మళ్లీ పట్టణ నిరుపేదసంఘం సభ్యులు అదే స్థలంలో రెండోసారి గుడారాలు వేశారు. విషయం తెలుసుకున్న మున్సిపాలిటీ అధికారులు ఆర్డీఓ మొగిలి వెంకటేశ్వర్లు, డీఎస్పీ ఎం.వీరారెడ్డి, గ్రామీణ పోలీసుల సహాయంతో ఆ ప్రాంతానికి వెళ్లి గుడారాలు తొలగించే విధంగా సంఘం సభ్యులతో చర్చలు జరిపారు.

మున్సిపాలిటీ స్థలంలో వెలసిన గుడారాలు

గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం లింగంగుంట్ల వద్ద పురపాలక స్థలంలో కొందరు గుడారాలు వేశారు. పట్టణ నిరుపేద సంఘం, బహుజన సమాజ్​వాదీ పార్టీ నేతల ఆధ్వర్యంలో సుమారు వంద కుటుంబాలు అక్రమంగా గుడారాలు ఏర్పాటు చేశారు. గతంలో ఇదే పని చేసినప్పుడు అప్పటి ఆర్డీఓ, డీఎస్పీ ఆక్రమణదారులతో చర్చించి సమస్యను పరిష్కరించారు. మళ్లీ పట్టణ నిరుపేదసంఘం సభ్యులు అదే స్థలంలో రెండోసారి గుడారాలు వేశారు. విషయం తెలుసుకున్న మున్సిపాలిటీ అధికారులు ఆర్డీఓ మొగిలి వెంకటేశ్వర్లు, డీఎస్పీ ఎం.వీరారెడ్డి, గ్రామీణ పోలీసుల సహాయంతో ఆ ప్రాంతానికి వెళ్లి గుడారాలు తొలగించే విధంగా సంఘం సభ్యులతో చర్చలు జరిపారు.

ఇది కూడా చదవండి.

విద్యుత్‌ కంపెనీల పిటిషన్లపై ఈనెల 22న విచారణ

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.