ETV Bharat / state

ఎస్సై బెదిరిస్తున్నారని ఎస్పీకి ఫిర్యాదు..!

ఏదైనా సమస్య వస్తే.. పోలీసులు సాయం కోరుతాం... మరి ఆ పోలీసే సమస్యగా మారితే ఎక్కడి వెళ్లాలి.. ఇది ఓ యువకుడి పరిస్థితి. ఆస్తి తగాదా కేసులో గుంటూరు జిల్లా తాడికొండ పోలీసు స్టేషన్​కు వెళ్లిన స్థానికుడు సాగర్​బాబును.. సమస్య పరిష్కరించాలంటే ఎంత ఇస్తావ్ అని అడుగుతున్నారని బాధితుడు వాపోతున్నారు.

author img

By

Published : Dec 9, 2019, 10:34 PM IST

person complaint on tadikonda si to sp
ఎస్సై బెదిరిస్తున్నారని ఎస్పీకి ఫిర్యాదు..!
మాట్లాడుతున్న బాధితుడు సాగర్ బాబు
గుంటూరు జిల్లా తాడికొండ మండలం పాములపాడు గ్రామానికి చెందిన సాగర్ బాబు విజయవాడలోని ఓ వసతి గృహంలో ఉంటూ విద్యనభ్యసించారు. తన తండ్రి చిన్నప్ప మానసిక ఒత్తిడికిలోనై 2001లో ఆత్మహత్య చేసుకున్నారని సాగర్ తెలిపారు. ఆ తర్వాత తల్లి కూడా అనారోగ్యంతో మృతి చెందారని చెప్పారు. చిన్నప్ప ఆస్తిపై కన్నేసిన సాగర్ మేనమామ రమేష్ పాములుపాడు ఉన్న స్థలాన్ని ఆక్రమించారని బాధితుడు వాపోతున్నాడు. ఈ విషయంపై తాడికొండ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేస్తే న్యాయం చేయకుండా..రాజీ కుదుర్చుకోమని బెదిరిస్తున్నారని వాపోయారు. 'నువ్వు కేసు పెట్టినవాళ్లు నాకు డబ్బులిచ్చారు. నువ్వు ఎంత ఇస్తావో చెప్పు...' అని ఎస్సై బెదిరిస్తున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. తనకు మేనమామ రమేష్ నుంచి ప్రాణహాని ఉందని, తన ఆస్తిని అప్పగించాలని కోరుతూ అర్బన్ ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.

ఇదీ చదవండి :

ఓటు సిరా కాదు... ఉల్లి సిరా..!

మాట్లాడుతున్న బాధితుడు సాగర్ బాబు
గుంటూరు జిల్లా తాడికొండ మండలం పాములపాడు గ్రామానికి చెందిన సాగర్ బాబు విజయవాడలోని ఓ వసతి గృహంలో ఉంటూ విద్యనభ్యసించారు. తన తండ్రి చిన్నప్ప మానసిక ఒత్తిడికిలోనై 2001లో ఆత్మహత్య చేసుకున్నారని సాగర్ తెలిపారు. ఆ తర్వాత తల్లి కూడా అనారోగ్యంతో మృతి చెందారని చెప్పారు. చిన్నప్ప ఆస్తిపై కన్నేసిన సాగర్ మేనమామ రమేష్ పాములుపాడు ఉన్న స్థలాన్ని ఆక్రమించారని బాధితుడు వాపోతున్నాడు. ఈ విషయంపై తాడికొండ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేస్తే న్యాయం చేయకుండా..రాజీ కుదుర్చుకోమని బెదిరిస్తున్నారని వాపోయారు. 'నువ్వు కేసు పెట్టినవాళ్లు నాకు డబ్బులిచ్చారు. నువ్వు ఎంత ఇస్తావో చెప్పు...' అని ఎస్సై బెదిరిస్తున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. తనకు మేనమామ రమేష్ నుంచి ప్రాణహాని ఉందని, తన ఆస్తిని అప్పగించాలని కోరుతూ అర్బన్ ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.

ఇదీ చదవండి :

ఓటు సిరా కాదు... ఉల్లి సిరా..!

Intro:ఈశ్వరాచారి.... గుంటూరు తూర్పు... కంట్రిబ్యూటర్

యాంకర్..... తమ సమస్యను పరిష్కరించాలని కోరుతూ తాడికొండ పోలీస్ స్టేషన్ కి వెళితే..... నువ్వు కేసు పెట్టినవాళ్ళు నాకు డబ్బులు ఇచ్చారు నువు ఎంత ఇస్తావో చెప్పు ... లేదంటే నీకు 5 వేలు డబ్బులు ఇస్తాను సెటిల్ చేసుకుని వెళ్లిపోవాలని ఎస్సై బెదిరిస్తున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తంచేశారు. తమకు న్యాయం చేయాలని గుంటూరు అర్బన్ ఎస్పీ కార్యలయాలంలో ఫిర్యాదు చేశారు.

గుంటూరు జిల్లా తాడికొండ మండలం పాములపాడు గ్రామానికి చెందిన సాగర్ బాబు విజయవాడలోని హాస్టల్ ఉంటూ విద్యాను అభ్యసిస్తున్నాడు. తన తండ్రి చిన్నప్ప మానసిక ఒత్తిడికి లోనై 2001 లో ఆత్మహత్య చేసుకున్నాడు. సంవత్సరం తరువాత తన తల్లి కూడా అనారోగ్యంతో మృతి చెందింది. వారి ఆస్తి పై కన్నేసిన మేనమామ పాములుపాడు ఉన్న స్థలాన్ని అక్రమించారని బాధితుడు తెలిపాడు. ఈ విషియం పై తాడికొండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే పోలీసులు రాజీ కుదుర్చుకోమని బెదిరిస్తున్నారని వాపోయాడు. తనని చంపేస్తానని మేనమామ బెదిరిస్తున్నారని తనకు రక్షణ కల్పించి... తనకు రావాల్సిన ఆస్తిని తనకు అప్పగించాలని బాధితుడు అర్బన్ ఎస్పీ కార్యలయాలంలో ఫిర్యాదు చేశాడు.




Body:బైట్... సాగర్ బాబు, బాధితుడు


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.