ETV Bharat / state

'మా స్థలాలు లాక్కుంటే ఆత్మహత్యలే శరణ్యం' - people warn govt for taking their house lands in all districts of ap

ఉగాది నాటికి పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వలాన్న ప్రభుత్వ నిర్ణయానికి అడుగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయి. పేదల భూములను లాక్కొని తిరిగి పేదలకే ఇవ్వాలనుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పేదల స్థలాలు సేకరించటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తమకు ఇచ్చిన భూములను తిరిగి తీసుకోవాలని చూస్తే ఆత్మహత్య చేసుకుంటామంటూ పలు జిల్లాలో లబ్ధిదారులు హెచ్చరిస్తున్నారు.

people protest for taking lands for giving another one
పలు చోట్ల ఆందోళన చేస్తున్న ప్రజలు
author img

By

Published : Mar 2, 2020, 11:08 PM IST

ఇళ్ల స్థలాల సేకరణలో వివాదం.. ఆందోళన బాటలో జనం

పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో పేదల ఇళ్ల స్థలాల భూసేకరణ.. వివాదాలకు దారి తీస్తోంది. పెనుగొండ మండలం దేవా గ్రామ పరిధిలోని వంగ తాళ్ల చెరువులో స్థానికులు, రైతులు ఆందోళనకు దిగారు. మంచినీటి చెరువును పూడిక చేసేందుకు అధికారులు చేసిన ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. పలువురు మహిళలు పెట్రోల్​ బాటిళ్లు పట్టుకుని ధర్నాకు దిగారు. ఇదే నియోజకవర్గం పెనుగొండ మండలం సిద్ధాంతంలో పంట పొలాలు పూడ్చేందుకు అధికారులు రహదారి నిర్మాణం చేపట్టడాన్ని రైతులు అడ్డుకున్నారు.

ప్లాట్లు తీసుకుంటే ప్రాణాలు తీసుకుంటామని గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం అల్లవారి పాలెం వాసులు అధికారులను హెచ్చరించారు. 40 ఏళ్ల క్రితం 130 మందికి ఒక్కొక్కరికి మూడు సెంట్ల చొప్పున ప్లాటు ఇచ్చారని... కొద్దిరోజులుగా వాటిని వేరే వారికి ఇవ్వాలని రెవెన్యూ అధికారులు తమపై ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన చెందారు.

కృష్ణా జిల్లాలో తెదేపా నేత తంగిరాల సౌమ్య.. లబ్ధిదారులను కలిశారు. వీరులపాడు మండలం తాటిగుమ్మి గ్రామంలో మాట్లాడిన ఆమె పేదల భూములను, స్థలాలను అధికారాన్ని ఉపయోగించి లాక్కోవాలనుకోవడం అన్యాయమని దుయ్యబట్టారు.

ప్రభుత్వం తమకు ఇచ్చిన భూమిలో రోడ్డు వేయొద్దంటూ అనంతపురం జిల్లా గాండ్లపెంట రోడ్డుకు అడ్డంగా బండ రాళ్ళు వేసి పనులను అడ్డుకున్నారు. మండల పరిధిలోని మనమీద పల్లి రహదారి నుంచి తూపల్లె రోడ్డు మార్గంలో పనులు మంజూరయ్యాయి. ఈ మార్గంలోని భూమిని ప్రభుత్వం గతంలో నాయీబ్రాహ్మణులు, మౌజన్ల కు కేటాయించింది. వారంతా పనులను అడ్డుకున్నారు.

ఇదీ చూడండి:

'నివాసమున్న చోటే.. ఇళ్ల స్థలాలు కేటాయించాలి'

ఇళ్ల స్థలాల సేకరణలో వివాదం.. ఆందోళన బాటలో జనం

పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో పేదల ఇళ్ల స్థలాల భూసేకరణ.. వివాదాలకు దారి తీస్తోంది. పెనుగొండ మండలం దేవా గ్రామ పరిధిలోని వంగ తాళ్ల చెరువులో స్థానికులు, రైతులు ఆందోళనకు దిగారు. మంచినీటి చెరువును పూడిక చేసేందుకు అధికారులు చేసిన ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. పలువురు మహిళలు పెట్రోల్​ బాటిళ్లు పట్టుకుని ధర్నాకు దిగారు. ఇదే నియోజకవర్గం పెనుగొండ మండలం సిద్ధాంతంలో పంట పొలాలు పూడ్చేందుకు అధికారులు రహదారి నిర్మాణం చేపట్టడాన్ని రైతులు అడ్డుకున్నారు.

ప్లాట్లు తీసుకుంటే ప్రాణాలు తీసుకుంటామని గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం అల్లవారి పాలెం వాసులు అధికారులను హెచ్చరించారు. 40 ఏళ్ల క్రితం 130 మందికి ఒక్కొక్కరికి మూడు సెంట్ల చొప్పున ప్లాటు ఇచ్చారని... కొద్దిరోజులుగా వాటిని వేరే వారికి ఇవ్వాలని రెవెన్యూ అధికారులు తమపై ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన చెందారు.

కృష్ణా జిల్లాలో తెదేపా నేత తంగిరాల సౌమ్య.. లబ్ధిదారులను కలిశారు. వీరులపాడు మండలం తాటిగుమ్మి గ్రామంలో మాట్లాడిన ఆమె పేదల భూములను, స్థలాలను అధికారాన్ని ఉపయోగించి లాక్కోవాలనుకోవడం అన్యాయమని దుయ్యబట్టారు.

ప్రభుత్వం తమకు ఇచ్చిన భూమిలో రోడ్డు వేయొద్దంటూ అనంతపురం జిల్లా గాండ్లపెంట రోడ్డుకు అడ్డంగా బండ రాళ్ళు వేసి పనులను అడ్డుకున్నారు. మండల పరిధిలోని మనమీద పల్లి రహదారి నుంచి తూపల్లె రోడ్డు మార్గంలో పనులు మంజూరయ్యాయి. ఈ మార్గంలోని భూమిని ప్రభుత్వం గతంలో నాయీబ్రాహ్మణులు, మౌజన్ల కు కేటాయించింది. వారంతా పనులను అడ్డుకున్నారు.

ఇదీ చూడండి:

'నివాసమున్న చోటే.. ఇళ్ల స్థలాలు కేటాయించాలి'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.