కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అహర్నిశలు శ్రమిస్తున్న మున్సిపల్ కార్మికులకు తక్షణమే మాస్కులు శానిటైజర్లు, గ్లౌజులు సరఫరా చేయాలని పంచాయతీ పరిషత్ రాష్ట్ర చైర్మన్ జాస్తి వీరాంజనేయులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది కరోన వైరస్ బారిన పడుతుంటే.. వైరస్ ప్రబలకుండా మున్సిపల్ కార్మికులు అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. గుంటూరు జిల్లాలో కొన్ని గ్రామాలలో ఇప్పటికీ బ్లీచింగ్, సోడియం హైడ్రోక్లోరైడ్ పిచికారి చేయలేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయలని కోరారు.
ఇవీ చూడండి...