ETV Bharat / state

వైద్యుల నిర్లక్ష్యం: సకాలంలో వైద్యం అందక వ్యక్తి మృతి

author img

By

Published : Jun 15, 2021, 5:22 PM IST

గుంటూరు వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలోని వైద్యుల నిర్లక్ష్యంతో... సామాన్యులు ప్రాణాలు కోల్పోతున్నారు. లిప్ట్ నుంచి కిందపడి తీవ్రరక్తస్రావమైన ఓ వ్యక్తిని... వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. వైద్యులు వెంటేనే చికిత్స అందించాల్సింది పోయి.. పారిశుద్ధ్య కార్మికురాలితో కట్టుకట్టించారు. అంతేగాక శ్వాసతో ఇబ్బందిపడుతున్న బాధితుడికి ఆక్సిజన్ అందించక పోవటంతోనే ప్రాణాలు కోల్పోయాడని బంధువులు ఆరోపిస్తున్నారు.

లిప్ట్​ నుంచి కిందపడిన వ్యక్తికి సకాలంలో వైద్యం అందక మృతి
లిప్ట్​ నుంచి కిందపడిన వ్యక్తికి సకాలంలో వైద్యం అందక మృతి



గుంటూరు జిల్లా వినుకొండ ప్రభుత్వ వైద్యశాలలో అత్యవసర చికిత్స సేవలు లేకపోవడంతో ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. నామమాత్రపు చికిత్సకు మాత్రమే 30 పడకల ఆసుపత్రి పరిమితం కావటంతో.... వైద్యం సకాలంలో అందక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. లిఫ్ట్ నుంచి ప్రమాదవశాత్తు పడి ఓ వ్యక్తి తలకు తీవ్రంగా గాయమైంది. రక్తస్రావం అవతున్న మారెళ్ళ ఎలమందా రెడ్డిని వినుకొండ ఆసుపత్రికి తరలించారు. శ్వాస అందక సుమారు గంట పాటు ఆసుపత్రి స్ట్రక్చర్​పై కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నా... చికిత్స అందించాల్సిన వైద్యులు పారిశుద్ధ్య కార్మికురాలితో తలకు కట్టు కట్టించారు. అంతేగాక శ్వాస అందక ఇబ్బంది పడుతున్న ఆ వ్యక్తికి ఆక్సిజన్ అందించకపోవటంతోనే మృతి చెందినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైద్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.



గుంటూరు జిల్లా వినుకొండ ప్రభుత్వ వైద్యశాలలో అత్యవసర చికిత్స సేవలు లేకపోవడంతో ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. నామమాత్రపు చికిత్సకు మాత్రమే 30 పడకల ఆసుపత్రి పరిమితం కావటంతో.... వైద్యం సకాలంలో అందక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. లిఫ్ట్ నుంచి ప్రమాదవశాత్తు పడి ఓ వ్యక్తి తలకు తీవ్రంగా గాయమైంది. రక్తస్రావం అవతున్న మారెళ్ళ ఎలమందా రెడ్డిని వినుకొండ ఆసుపత్రికి తరలించారు. శ్వాస అందక సుమారు గంట పాటు ఆసుపత్రి స్ట్రక్చర్​పై కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నా... చికిత్స అందించాల్సిన వైద్యులు పారిశుద్ధ్య కార్మికురాలితో తలకు కట్టు కట్టించారు. అంతేగాక శ్వాస అందక ఇబ్బంది పడుతున్న ఆ వ్యక్తికి ఆక్సిజన్ అందించకపోవటంతోనే మృతి చెందినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైద్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఇవీ చదవండి

లిఫ్ట్ గదిలో పడి వ్యక్తి మృతి

MURDER: తల్లి, చెల్లితో కలిసి భర్తను అంతమెుందించిన భార్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.