గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం పల్లపాడు మండల పరిషత్ పాఠశాల 60 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా.. 'స్నేహానికి షష్టిపూర్తి' పేరుతో పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. గతంలో ఈ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులంతా హాజరయ్యారు. ఎన్నో ఏళ్ల తర్వాత తమ బాల్య స్నేహితులను కలుసుకుని ముచ్చట్లు చెప్పుకున్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకున్నారు. పూర్వ విద్యార్థులందరూ కలిసి ఊరిలోని వృద్ధులను సన్మానించారు. ఈ కార్యక్రమానికి ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఎడిటర్ ఎం. నాగేశ్వరరావు హాజరయ్యారు. తన చిన్ననాటి ఆత్మీయులను కలుసుకుని.. ఊరితో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
ఇవీ చదవండి.. 'అమ్మ, ఊరు' మన నుంచి ఎప్పటికీ విడిపోవు