ETV Bharat / state

పల్లపాడులో 60 ఏళ్ల పూర్వ విద్యార్థుల సకుటుంబ సమావేశం - గుంటూరు జిల్లా పల్లపాడులో పూర్వవిద్యార్థుల సమ్మేళనం

గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం పల్లపాడు మండల పరిషత్ పాఠశాల 60 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. 'స్నేహానికి షష్టిపూర్తి' పేరుతో పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఎడిటర్ ఎం. నాగేశ్వరరావు హాజరయ్యారు.

old students meet at pallapadu guntur district
పల్లపాడులో పూర్వవిద్యార్థుల సమ్మేళనం
author img

By

Published : Feb 23, 2020, 8:08 PM IST

పల్లపాడులో పూర్వ విద్యార్థుల సమ్మేళనం

గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం పల్లపాడు మండల పరిషత్ పాఠశాల 60 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా.. 'స్నేహానికి షష్టిపూర్తి' పేరుతో పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. గతంలో ఈ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులంతా హాజరయ్యారు. ఎన్నో ఏళ్ల తర్వాత తమ బాల్య స్నేహితులను కలుసుకుని ముచ్చట్లు చెప్పుకున్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకున్నారు. పూర్వ విద్యార్థులందరూ కలిసి ఊరిలోని వృద్ధులను సన్మానించారు. ఈ కార్యక్రమానికి ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఎడిటర్ ఎం. నాగేశ్వరరావు హాజరయ్యారు. తన చిన్ననాటి ఆత్మీయులను కలుసుకుని.. ఊరితో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

ఇవీ చదవండి.. 'అమ్మ, ఊరు' మన నుంచి ఎప్పటికీ విడిపోవు

పల్లపాడులో పూర్వ విద్యార్థుల సమ్మేళనం

గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం పల్లపాడు మండల పరిషత్ పాఠశాల 60 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా.. 'స్నేహానికి షష్టిపూర్తి' పేరుతో పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. గతంలో ఈ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులంతా హాజరయ్యారు. ఎన్నో ఏళ్ల తర్వాత తమ బాల్య స్నేహితులను కలుసుకుని ముచ్చట్లు చెప్పుకున్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకున్నారు. పూర్వ విద్యార్థులందరూ కలిసి ఊరిలోని వృద్ధులను సన్మానించారు. ఈ కార్యక్రమానికి ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఎడిటర్ ఎం. నాగేశ్వరరావు హాజరయ్యారు. తన చిన్ననాటి ఆత్మీయులను కలుసుకుని.. ఊరితో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

ఇవీ చదవండి.. 'అమ్మ, ఊరు' మన నుంచి ఎప్పటికీ విడిపోవు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.