విద్యార్థిని అతిథి గృహానికి రమ్మన్న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయాన్ని ఉపకులపతిపై దిశ, నిర్భయ కేసులు నమోదు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. మూడు రాజధానులకు మద్దతుగా బుధవారం నిర్వహించిన సదస్సులో సందేహాలు అడిగినందుకు విద్యార్థిని స్టేజిపై నుంచి కిందకి నెట్టేశారని... అనుమానాలుంటే అతిథిగృహానికి రావాలని ఆమెను అన్నారంటూ విద్యార్థులు ఆరోపించారు. ఆయనపై ఉన్న అవినీతి మరకలను తొలగించుకునేందుకు వైకాపాకు మద్దతుగా విశ్వవిద్యాలయంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని విద్యార్థి సంఘాలు చెప్పారు. ఈ విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామని నేతలు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి :