ETV Bharat / state

'కరోనాతో చనిపోతే.. ఉచితంగానే అంత్యక్రియలు'

author img

By

Published : May 18, 2021, 10:53 AM IST

గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ప్రభుత్వ ఆసుపత్రి, టిడ్కో కొవిడ్ కేర్ సెంటర్ లలో ఎమ్మెల్యే విడదల రజిని ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. హాస్పిటల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తన్నామన్నారు. కొవిడ్ తో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులందరికీ తమ సొంత సంస్థ వి ఆర్ ఫౌండేషన్ ద్వారా ఉచితంగా రెండు పూటలా భోజనం, ఉదయం అల్పాహారం అందిస్తామని చెప్పారు.

MLA Vidadhala Rajini
ఎమ్మెల్యే విడదల రజిని

గుంటూరు జిల్లా చిల‌క‌లూరిపేట‌లోని ప్ర‌భుత్వాసుపత్రికి కావాల్సిన అన్ని సౌక‌ర్యాలు క‌ల్పిస్తామని ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జిని భ‌రోసా ఇచ్చారు. చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రి తోపాటు టిడ్కో భవనంలో ఉన్న కొవిడ్ కేర్ సెంటర్ ను ఎమ్మెల్యే పరిశీలించారు. క‌రోనా రోగుల‌కు అందుతున్న చికిత్స‌పై ఆరా తీశారు. బెడ్లు, మందులు ఉన్నాయ‌ని, ఆక్సిజ‌న్‌, రెమిడెసివ‌ర్ ఇంజిక్ష‌న్లు స‌రిప‌డా అందితే ఏ ఇబ్బంది లేకుండా రోగుల‌కు చికిత్స అందించ‌వ‌చ్చ‌ని వైద్యులు చెప్పారు.

వెంటనే సమస్యను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఆస్పత్రిలో కొవిడ్ తో చికిత్స పొందుతున్న రోగులందరికీ తమ సొంత సంస్థ వీఆర్ ఫౌండేషన్ ద్వారా రెండు పూటలా భోజనం, ఉదయం అల్పాహారం ఉచితంగా అందజేస్తామన్నారు. కొవిడ్ మృతదేహాల తరలింపుకు ఉచితంగా వాహనాల ఏర్పాటు.. క‌రోనాతో చిల‌క‌లూరిపేటలో ఎవ‌రైనా మ‌ర‌ణిస్తే వారి మృతదేహాల తరలింపునకు పురపాలక సంఘం తరపున ఉచితంగా వాహనాలు ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

క‌రోనా మ‌ర‌ణాల‌పై ఎమ్మెల్యే మాట్లాడుతుండ‌గా మృతదేహాల తరలింపు విష‌యంలో బాధిత కుటుంబీకులు పడుతున్న ఇబ్బందులను నాయకులు వివరించారు. స్పందించిన ఎమ్మెల్యే.. పట్టణంలో క‌రోనాతో ఎవ‌రైనా ఎక్క‌డైనా చ‌నిపోతే... ఉచితంగా సేవ‌లు అందించాల‌ని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాల నుంచి ఒక్క రూపాయి కూడా వ‌సూలు చేయ‌డానికి వీల్లేద‌ని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

కరోనా కాలంలోనూ.. చుక్క పడాల్సిందే..!

గుంటూరు జిల్లా చిల‌క‌లూరిపేట‌లోని ప్ర‌భుత్వాసుపత్రికి కావాల్సిన అన్ని సౌక‌ర్యాలు క‌ల్పిస్తామని ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జిని భ‌రోసా ఇచ్చారు. చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రి తోపాటు టిడ్కో భవనంలో ఉన్న కొవిడ్ కేర్ సెంటర్ ను ఎమ్మెల్యే పరిశీలించారు. క‌రోనా రోగుల‌కు అందుతున్న చికిత్స‌పై ఆరా తీశారు. బెడ్లు, మందులు ఉన్నాయ‌ని, ఆక్సిజ‌న్‌, రెమిడెసివ‌ర్ ఇంజిక్ష‌న్లు స‌రిప‌డా అందితే ఏ ఇబ్బంది లేకుండా రోగుల‌కు చికిత్స అందించ‌వ‌చ్చ‌ని వైద్యులు చెప్పారు.

వెంటనే సమస్యను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఆస్పత్రిలో కొవిడ్ తో చికిత్స పొందుతున్న రోగులందరికీ తమ సొంత సంస్థ వీఆర్ ఫౌండేషన్ ద్వారా రెండు పూటలా భోజనం, ఉదయం అల్పాహారం ఉచితంగా అందజేస్తామన్నారు. కొవిడ్ మృతదేహాల తరలింపుకు ఉచితంగా వాహనాల ఏర్పాటు.. క‌రోనాతో చిల‌క‌లూరిపేటలో ఎవ‌రైనా మ‌ర‌ణిస్తే వారి మృతదేహాల తరలింపునకు పురపాలక సంఘం తరపున ఉచితంగా వాహనాలు ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

క‌రోనా మ‌ర‌ణాల‌పై ఎమ్మెల్యే మాట్లాడుతుండ‌గా మృతదేహాల తరలింపు విష‌యంలో బాధిత కుటుంబీకులు పడుతున్న ఇబ్బందులను నాయకులు వివరించారు. స్పందించిన ఎమ్మెల్యే.. పట్టణంలో క‌రోనాతో ఎవ‌రైనా ఎక్క‌డైనా చ‌నిపోతే... ఉచితంగా సేవ‌లు అందించాల‌ని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాల నుంచి ఒక్క రూపాయి కూడా వ‌సూలు చేయ‌డానికి వీల్లేద‌ని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

కరోనా కాలంలోనూ.. చుక్క పడాల్సిందే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.