ETV Bharat / state

అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణం తెదేపానే పూర్తి చేయాలి: అన్నాబత్తుని శివకుమార్ - ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్

గుంటూరు జిల్లా తెనాలిలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పాదయాత్ర చేపట్టారు. సీఎం జగన్ ప్రజా సంకల్ప యాత్ర చేసి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా పాదయాత్ర నిర్వహించినట్లు ఆయన తెలిపారు. పేదల ఇళ్లను లబ్ధిదారులకు సంక్రాంతి వరకు అప్పగించకుంటే స్వాధీనం చేసుకుంటామన్న తెదేపా నేతల వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. అసంపూర్తిగా ఉన్న పనులు కూడా వారే పూర్తి చేయాలని ఎమ్మెల్యే అన్నారు.

mla annabathuni shivakumar fires on tdp about giving houses to beneficiaries
అసంపూర్తిగా ఉన్న గృహాల పనులు తెదేపానే పూర్తి చేయాలి: అన్నాబత్తుని శివకుమార్
author img

By

Published : Nov 10, 2020, 7:18 AM IST

సీఎం జగన్ ప్రజా సంకల్ప యాత్ర చేసి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా గుంటూరు జిల్లా తెనాలిలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పాదయాత్ర చేపట్టారు. ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అర్హత ఉన్న అందరికీ... కులమతాలు, పార్టీలకు అతీతంగా సంక్షేమ ఫలాలు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.

గత ప్రభుత్వ హయాంలో తెనాలిలో స్థలం కూడా కొనకుండా ప్రజలకు ఇళ్లు ఇస్తామని చెప్పి డీడీలు వసూలు చేసి మోసం చేశారని శివకుమార్ విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ డీడీలు తిరిగి ప్రజలకు ఇచ్చామని గుర్తు చేశారు. వాస్తవాలు తెలిస్తే తెదేపా కార్యాలయంపై లబ్ధిదారులు దాడి చేస్తారని హెచ్చరించారు. తెదేపా పరిపాలనలో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయకపోవడం అసమర్థత కాదా అని ప్రశ్నించారు. సంక్రాంతికి ఇళ్లను స్వాధీనం చేసుకుంటామన్న తెదేపా నేతల వ్యాఖ్యలపై స్పందిస్తూ... అసంపూర్తిగా ఉన్న పనులు కూడా వారే పూర్తి చేయాలన్నారు. ఇళ్ల నిర్మాణం పేరిట జరిగిన అవినీతి బయటకు తీస్తామన్నారు.

సీఎం జగన్ ప్రజా సంకల్ప యాత్ర చేసి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా గుంటూరు జిల్లా తెనాలిలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పాదయాత్ర చేపట్టారు. ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అర్హత ఉన్న అందరికీ... కులమతాలు, పార్టీలకు అతీతంగా సంక్షేమ ఫలాలు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.

గత ప్రభుత్వ హయాంలో తెనాలిలో స్థలం కూడా కొనకుండా ప్రజలకు ఇళ్లు ఇస్తామని చెప్పి డీడీలు వసూలు చేసి మోసం చేశారని శివకుమార్ విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ డీడీలు తిరిగి ప్రజలకు ఇచ్చామని గుర్తు చేశారు. వాస్తవాలు తెలిస్తే తెదేపా కార్యాలయంపై లబ్ధిదారులు దాడి చేస్తారని హెచ్చరించారు. తెదేపా పరిపాలనలో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయకపోవడం అసమర్థత కాదా అని ప్రశ్నించారు. సంక్రాంతికి ఇళ్లను స్వాధీనం చేసుకుంటామన్న తెదేపా నేతల వ్యాఖ్యలపై స్పందిస్తూ... అసంపూర్తిగా ఉన్న పనులు కూడా వారే పూర్తి చేయాలన్నారు. ఇళ్ల నిర్మాణం పేరిట జరిగిన అవినీతి బయటకు తీస్తామన్నారు.

ఇదీ చదవండి:

ఆ 6 జిల్లాల్లోనూ ఆరోగ్య శ్రీ విస్తరణ సేవలు..ఇవాళే ముహుర్తం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.