ETV Bharat / state

22 నుంచి సత్తెనపల్లిలో సంపూర్ణ లాక్​డౌన్​

author img

By

Published : Jul 20, 2020, 10:06 PM IST

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా ఈనెల 22 నుంచి పూర్తిగా లాక్​డౌన్​ విధించనున్నట్లు అధికారులు వెల్లడించారు. వైరస్​ నియంత్రణపై ఎమ్మెల్యే అంబటి రాంబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు.

mla ambati rambabu review meeting
వైరస్​ నియంత్రణపై ఎమ్మెల్యే అంబటి రాంబాబు అధికారులతో సమీక్ష

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఈనెల 22 నుంచి సంపూర్ణ లాక్​డౌన్ విధించాలని అధికారులు నిర్ణయించారు. పట్టణంలో 165 కరోనా కేసులు, చుట్టుపక్కల గ్రామాల్లో 30కి పైగా కేసులు నమోదు కావడంపై.. అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రజలు ముందుగానే తమకు కావాల్సిన నిత్యావసర సరుకుల్ని కొనుగోలు చేసి ఉంచుకోవాలని సూచించారు. ఆదివారం కరోనా రోగి నడిరోడ్డుపై మరణించి ఘటన.. ప్రజల్లో మరింత ఆందోళన పెంచింది. ఇప్పటి వరకూ సత్తెనపల్లిలో 8 మంది కరోనా కారణంగా మరణించిన పరిస్థితుల్లో.. అధికారులు వైరస్ నివారణపై ముమ్మరంగా చర్యలు మొదలుపెట్టారు.

ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఇవాళ సత్తెనపల్లిలో రెవెన్యూ, మున్సిపల్, పోలీస్​, వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. కేసుల నియంత్రణకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని సూచించారు. కొత్తపేట, నాగార్జు నగర్, రఘురాం కాలనీ, వడ్డవల్లి ప్రాంతాల్లో ఎక్కువగా కరోనా కేసులు నమోదు కావడంపై... ఇప్పటికే ఆయా ఏరియాలను రెడ్​జోన్​లుగా ప్రకటించారు. అయితే మిగతా ప్రాంతాల్లోనూ ప్రజల రాకపోకల్ని కట్టిడి చేయటం ద్వారా వైరస్ వ్యాప్తిని నియంత్రించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ దిశగా అధికారులతో.. ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రభుత్వ సూచనలు వివరించారు.

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఈనెల 22 నుంచి సంపూర్ణ లాక్​డౌన్ విధించాలని అధికారులు నిర్ణయించారు. పట్టణంలో 165 కరోనా కేసులు, చుట్టుపక్కల గ్రామాల్లో 30కి పైగా కేసులు నమోదు కావడంపై.. అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రజలు ముందుగానే తమకు కావాల్సిన నిత్యావసర సరుకుల్ని కొనుగోలు చేసి ఉంచుకోవాలని సూచించారు. ఆదివారం కరోనా రోగి నడిరోడ్డుపై మరణించి ఘటన.. ప్రజల్లో మరింత ఆందోళన పెంచింది. ఇప్పటి వరకూ సత్తెనపల్లిలో 8 మంది కరోనా కారణంగా మరణించిన పరిస్థితుల్లో.. అధికారులు వైరస్ నివారణపై ముమ్మరంగా చర్యలు మొదలుపెట్టారు.

ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఇవాళ సత్తెనపల్లిలో రెవెన్యూ, మున్సిపల్, పోలీస్​, వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. కేసుల నియంత్రణకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని సూచించారు. కొత్తపేట, నాగార్జు నగర్, రఘురాం కాలనీ, వడ్డవల్లి ప్రాంతాల్లో ఎక్కువగా కరోనా కేసులు నమోదు కావడంపై... ఇప్పటికే ఆయా ఏరియాలను రెడ్​జోన్​లుగా ప్రకటించారు. అయితే మిగతా ప్రాంతాల్లోనూ ప్రజల రాకపోకల్ని కట్టిడి చేయటం ద్వారా వైరస్ వ్యాప్తిని నియంత్రించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ దిశగా అధికారులతో.. ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రభుత్వ సూచనలు వివరించారు.

ఇవీ చూడండి:

గుంటూరు జిల్లాలో వ్యర్థ రహిత పల్లెలే లక్ష్యం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.