గుంటూరు జిల్లా క్రోసూరు మండలం దొడ్లేరు గ్రామంలో వివాహిత దారుణ హత్యకు గురైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల గ్రామానికి చెందిన కోటేశ్వరమ్మకు క్రోసూరు మండలం దొడ్లేరు గ్రామానికి చెందిన బోడా సుబ్బారావుతో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు సంతానం. ఇటీవల భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. వివాహేతర సంబంధం నడుపుతుందని భార్యపై సుబ్బారావు అనుమానం పెంచుకున్నాడు. కొంతకాలంగా ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది.
ఈ విషయమై భార్య కోటేశ్వరమ్మ క్రోసూరు పోలీసులను ఆశ్రయించింది. భర్తతో పాటు కుటుంబ సభ్యులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈరోజు ఉదయం భర్త, అత్త తనపై దాడి చేస్తున్నారని కోటేశ్వరమ్మ తన తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా తెలియజేసింది. కోటేశ్వరమ్మ తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. దొడ్లేరు గ్రామానికి వచ్చేటప్పటికి కుమార్తె మరణించిందని తల్లిదండ్రులు తెలిపారు. భర్త, అత్త కలిసి తమ కుమార్తెను హత్య చేశారని ఆరోపించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: