ETV Bharat / state

స్నేహితుల మధ్య ఘర్షణ... యువకుడు మృతి

author img

By

Published : Mar 23, 2021, 5:00 AM IST

గుంటూరులో దారుణం జరిగింది. ఓ బార్​లో ఓ యువకుడిని తోటి స్నేహితులు కొట్టి హతమార్చారు. ఈ ఘటనకు పాల్పడిన ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

man dead on a attack in guntur
స్నేహితుల మధ్య ఘర్షణ... యువకుడు మృతి

గుంటూరు కేవీపీ కాలనీలోని గెలాక్సీ బార్​లో గోపీనాథ్ అనే యువకుడు హత్యకు గురయ్యాడు. స్నేహితులతో కలసి బార్​కు వెళ్ళిన గోపీనాథ్​కు, అతని స్నేహితల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ క్రమంలో గోపీనాథ్​పై కర్రలతో దాడి చేయడంతో ఆ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న నగరపాలెం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు నగరంపాలెం సీఐ మల్లికార్జున రావు తెలిపారు. త్వరలోనే నిందితుల వివరాలను మీడియాకు వెల్లడిస్తామని పేర్కొన్నారు.

గుంటూరు కేవీపీ కాలనీలోని గెలాక్సీ బార్​లో గోపీనాథ్ అనే యువకుడు హత్యకు గురయ్యాడు. స్నేహితులతో కలసి బార్​కు వెళ్ళిన గోపీనాథ్​కు, అతని స్నేహితల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ క్రమంలో గోపీనాథ్​పై కర్రలతో దాడి చేయడంతో ఆ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న నగరపాలెం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు నగరంపాలెం సీఐ మల్లికార్జున రావు తెలిపారు. త్వరలోనే నిందితుల వివరాలను మీడియాకు వెల్లడిస్తామని పేర్కొన్నారు.

ఇదీచదవండి.'సేంద్రీయ వ్యవసాయ నూతన విధానంలో అన్ని విభాగాలు భాగస్వామ్యం కావాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.