ETV Bharat / state

రేపటి నుంచి మంగళగిరిలో లాక్ డౌన్ సడలింపులు

గుంటూరు జిల్లా మంగళగిరిలో కరోనా కేసులు సున్నాకు రావటంతో రేపటినుంచి లాక్​డౌన్​లో సడలింపులు ఇవ్వనున్నట్లు అధికారులు వెల్లడించారు. వస్త్ర, ఆభరణాలు, పాదరక్షలు మినహాయించి అన్నీ దుకాణాలు తెరవవచ్చని తెలిపారు.

author img

By

Published : May 22, 2020, 6:18 PM IST

lockdown ezcemption in guntur dst mangalgiri  from tommarrow onwards
lockdown ezcemption in guntur dst mangalgiri from tommarrow onwards

గుంటూరు జిల్లా మంగళగిరిలో రేపటి నుంచి లాక్​డౌన్​కు సడలింపులు ఇవ్వనున్నారు. మంగళగిరిలో కరోనా పాజిటివ్ కేసులు సున్నాకు రావటంతో లాక్​డౌన్​లో సడలింపులివ్వాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు నియోజకవర్గ అధికారులతో శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సడలింపులో కచ్చితంగా నిబంధనలు పాటించాలని అధికారులకు సూచించారు. మరో కేసు రాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. వస్త్ర, ఆభరణాలు, పాదరక్షల దుకాణాలు మినహా అన్నింటికి అధికారులు అనుమతులిచ్చారు.

గుంటూరు జిల్లా మంగళగిరిలో రేపటి నుంచి లాక్​డౌన్​కు సడలింపులు ఇవ్వనున్నారు. మంగళగిరిలో కరోనా పాజిటివ్ కేసులు సున్నాకు రావటంతో లాక్​డౌన్​లో సడలింపులివ్వాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు నియోజకవర్గ అధికారులతో శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సడలింపులో కచ్చితంగా నిబంధనలు పాటించాలని అధికారులకు సూచించారు. మరో కేసు రాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. వస్త్ర, ఆభరణాలు, పాదరక్షల దుకాణాలు మినహా అన్నింటికి అధికారులు అనుమతులిచ్చారు.

ఇదీ చూడండి ప్రతి పరిశ్రమకు తక్కువ వడ్డీకే రుణాలు: సీఎం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.