ETV Bharat / state

'మీరైనా పంపించండి.. మమ్మల్నైనా వెళ్లనివ్వండి'

author img

By

Published : May 11, 2020, 5:47 PM IST

కరోనా వ్యాప్తితో లాక్​డౌన్ అమల్లో ఉంది. వలస కార్మికులు అనేక రాష్ట్రాల్లో ఇబ్బంది పడుతున్నారు. గుంటూరు జిల్లాలో బీహార్ నుంచి వచ్చిన వలస కూలీలు లాక్​డౌన్ కారణంగా పని లేక చిక్కుకుపోయారు. తమను ఎలాగైనా స్వస్థలాలకు పంపాలని కోరుకుంటున్నారు. అనుమతిస్తే తామే ఎలాగోలా వెళ్లిపోతామని చెబుతున్నారు.

lock down problems
lock down problems

ఉన్న ఊళ్లో పని లేక వేల కిలోమీటర్లు వలస వచ్చారు. మిర్చి సీజన్లో కాయకష్టం చేసుకుని నాలుగు డబ్బులు వెనకేసుకుని వెళ్దామని అనుకున్నారు. కరోనా లాక్ డౌన్ కారణంగా అంతా చిన్నాభిన్నమైంది. యార్డు మూసివేసిన కారణంగా.. పనుల్లేక పస్తులుంటున్నారు.

తమ కోసం శ్రామిక్ రైలు వేయాలని... లేదంటే ప్రభుత్వం అనుమతిస్తే తామే ఎలాగోలా వాహనాలు మాట్లాడుకుని వెళ్తామని వలస కార్మికులు అంటున్నారు. ఏపీ సీఎం జగన్, బీహార్ సీఎం నితీష్ లు తమను ఆదుకోవాలని.. బీహార్ వలస కూలీలు వేడుకుంటున్నారు.

ఉన్న ఊళ్లో పని లేక వేల కిలోమీటర్లు వలస వచ్చారు. మిర్చి సీజన్లో కాయకష్టం చేసుకుని నాలుగు డబ్బులు వెనకేసుకుని వెళ్దామని అనుకున్నారు. కరోనా లాక్ డౌన్ కారణంగా అంతా చిన్నాభిన్నమైంది. యార్డు మూసివేసిన కారణంగా.. పనుల్లేక పస్తులుంటున్నారు.

తమ కోసం శ్రామిక్ రైలు వేయాలని... లేదంటే ప్రభుత్వం అనుమతిస్తే తామే ఎలాగోలా వాహనాలు మాట్లాడుకుని వెళ్తామని వలస కార్మికులు అంటున్నారు. ఏపీ సీఎం జగన్, బీహార్ సీఎం నితీష్ లు తమను ఆదుకోవాలని.. బీహార్ వలస కూలీలు వేడుకుంటున్నారు.

ఇదీ చదవండి:

మే 17 కంటే ముందే విమాన సర్వీసులు షురూ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.