ETV Bharat / state

కరోనా ఎఫెక్ట్​: స్పిన్నింగ్ మిల్లులకు ఎగుమతి కష్టాలు

author img

By

Published : Jun 25, 2020, 8:21 AM IST

కరోనా లాక్​డౌన్ ప్రభావం అన్ని రంగాలనూ వెంటాడుతోంది. సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న నూలు మిల్లుల్ని లాక్​డౌన్... మరింత దెబ్బతీసింది. కూలీల సమస్యతో మూడింట ఒకవంతు పరిశ్రమలు మూతపడే ఉండగా... నడుస్తున్న పరిశ్రమలు సైతం నష్టాలతో ఎదురీదుతున్నాయి. ఉత్పత్తి అయిన సరకు ఎక్కడికక్కడే నిలిచిపోయింది. పరిశ్రమలు నడపలేక... వడ్డీల భారం మోయలేక స్పిన్నింగ్ పరిశ్రమల నిర్వాహకులు అల్లాడుతున్నారు.

కరోనా ఎఫెక్ట్​ : స్పిన్నింగ్ మిల్లులకు ఎగుమతి కష్టాలు
కరోనా ఎఫెక్ట్​ : స్పిన్నింగ్ మిల్లులకు ఎగుమతి కష్టాలు

పత్తి ఆధారిత నూలు మిల్లులకు రాష్ట్రం పెట్టింది పేరు. రాష్ట్రవ్యాప్తంగా 128 స్పిన్నింగ్ మిల్లులుండంగా....వీటి వార్షిక టర్నోవర్ 13 వేల కోట్లు. ఉత్పత్తి చేసే నిల్వల్లో 50 శాతానికి పైగా ఎగుమతి వాటా ఉండగా... అందులోనూ 80 శాతం చైనాకు ఎగుమతి అవుతుంది. మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాలూ నూలు కొంటాయి. లాక్​డౌన్ ప్రభావంతో వస్త్రఉత్పత్తి నిలిచిపోవడంతో దారానికి గిరాకీ తగ్గింది. ఎగుమతులు, దేశీయ వినియోగం తగ్గిపోవడంతో ఎదురీదుతున్న స్పిన్నింగ్ పరిశ్రమకు లాక్​డౌన్ వల్ల కూలీల కొరత తోడైంది.

లాక్​డౌన్ సడలింపులతో మిల్లులు తెరుచుకున్నా... 30-40 శాతం సామర్థ్యంతోనే నడుపుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కోటిన్నర కిలోలకు పైగా దారపు నిల్వలు పేరుకుపోయాయి. డిమాండ్ లేక నూలు ధరలు తగ్గాయి. కరోనా ముందు 40 కౌంట్ నూలు ధర రూ.215 ఉంటే ప్రస్తుతం రూ.180కి పడిపోయింది. ఒక్కో మిల్లులోనూ 50 వేల కిలోల నుంచి 4 లక్షల కిలోల వరకు దారపు నిల్వలు స్తంభించిపోయాయి. ముడిసరకును 6నెలల ముందే నిల్వ చేసుకుంటారు. తయారీ నిల్వలు స్తంభించడంతో వడ్డీల భారంతో పరిశ్రమల యజమానులు, నిర్వాహకులు ఎదురీదుతున్నారు. కూలీల కొరత వల్ల ఉత్పత్తి, ఉత్పాదకత తగ్గగా...ఉన్న కార్మికులు, కూలీల జీతాలు, మార్చి నుంచి విద్యుత్ బిల్లుల బకాయిలు మోయలేని భారంగా మారాయని నిర్వాహకులు వాపోతున్నారు. లాక్​డౌన్ వల్ల కోట్లాది రూపాయల నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

స్పిన్నింగ్ మిల్లులతో పాటు జిన్నింగ్, వస్త్రాలు తయారుచేసే టెక్స్ టైల్, ఫ్యాబ్రిక్ పరిశ్రమలపైనా లాక్​డౌన్ ప్రభావం కన్పిస్తుంది. కేవలం జిన్నింగ్, స్పిన్నింగ్ ఉత్పత్తులకే పరిశ్రమలు పరిమితం కావడం వల్ల దారాన్ని అత్యధికంగా చైనాకు... దేశీయంగా తమిళనాడు,గుజరాత్, మహారాష్ట్రకు ఎగుమతి చేస్తున్నారు. చైనాతో సంబంధాలు దెబ్బతినడంతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. రోజుకు 50 కంటైనర్లు వరకు ఎగుమతి చేసే పరిశ్రమలు... ఇప్పుడు 10 కంటైనర్లకే పరిమితమయ్యాయి.

రాష్ట్రంలో వస్త్రాలు, ఇతర రెడీమేడ్ దుస్తులు తయారయ్యే ప్రొసెసింగ్, టెక్స్ టైల్ అపెరల్ పరిశ్రమలు పెద్దగా లేకపోవడం ఎప్పటి నుంచో లోటుగానే ఉంది. ప్రస్తుతం దారాన్ని మాత్రమే ఎగుమతి చేస్తుండగా.... వాల్యూ యాడెడ్ ఉత్పత్తులను అందిపుచ్చుకోలేక పోతున్నారు. టెక్నాలజీ అప్ గ్రేడెడ్ ఫండ్ కింద కేంద్రం గతంలో ఇచ్చిన రాయితీలు నిలిచిపోయాయి. ఐదేళ్లుగా రాష్ట్రం వైపు నుంచి విద్యుత్ రాయితీలు ఆగిపోయాయి. ఈ పరిస్థితుల్లో పరిశ్రమలు నూలు పరిశ్రమలు నడపడం వ్యాపారులకు కత్తిమీద సాములా మారింది.

ఇదీ చదవండి : ఎంపీ రామ్మోహన్​ నాయుడుకు సంసద్ రత్న అవార్డు

పత్తి ఆధారిత నూలు మిల్లులకు రాష్ట్రం పెట్టింది పేరు. రాష్ట్రవ్యాప్తంగా 128 స్పిన్నింగ్ మిల్లులుండంగా....వీటి వార్షిక టర్నోవర్ 13 వేల కోట్లు. ఉత్పత్తి చేసే నిల్వల్లో 50 శాతానికి పైగా ఎగుమతి వాటా ఉండగా... అందులోనూ 80 శాతం చైనాకు ఎగుమతి అవుతుంది. మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాలూ నూలు కొంటాయి. లాక్​డౌన్ ప్రభావంతో వస్త్రఉత్పత్తి నిలిచిపోవడంతో దారానికి గిరాకీ తగ్గింది. ఎగుమతులు, దేశీయ వినియోగం తగ్గిపోవడంతో ఎదురీదుతున్న స్పిన్నింగ్ పరిశ్రమకు లాక్​డౌన్ వల్ల కూలీల కొరత తోడైంది.

లాక్​డౌన్ సడలింపులతో మిల్లులు తెరుచుకున్నా... 30-40 శాతం సామర్థ్యంతోనే నడుపుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కోటిన్నర కిలోలకు పైగా దారపు నిల్వలు పేరుకుపోయాయి. డిమాండ్ లేక నూలు ధరలు తగ్గాయి. కరోనా ముందు 40 కౌంట్ నూలు ధర రూ.215 ఉంటే ప్రస్తుతం రూ.180కి పడిపోయింది. ఒక్కో మిల్లులోనూ 50 వేల కిలోల నుంచి 4 లక్షల కిలోల వరకు దారపు నిల్వలు స్తంభించిపోయాయి. ముడిసరకును 6నెలల ముందే నిల్వ చేసుకుంటారు. తయారీ నిల్వలు స్తంభించడంతో వడ్డీల భారంతో పరిశ్రమల యజమానులు, నిర్వాహకులు ఎదురీదుతున్నారు. కూలీల కొరత వల్ల ఉత్పత్తి, ఉత్పాదకత తగ్గగా...ఉన్న కార్మికులు, కూలీల జీతాలు, మార్చి నుంచి విద్యుత్ బిల్లుల బకాయిలు మోయలేని భారంగా మారాయని నిర్వాహకులు వాపోతున్నారు. లాక్​డౌన్ వల్ల కోట్లాది రూపాయల నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

స్పిన్నింగ్ మిల్లులతో పాటు జిన్నింగ్, వస్త్రాలు తయారుచేసే టెక్స్ టైల్, ఫ్యాబ్రిక్ పరిశ్రమలపైనా లాక్​డౌన్ ప్రభావం కన్పిస్తుంది. కేవలం జిన్నింగ్, స్పిన్నింగ్ ఉత్పత్తులకే పరిశ్రమలు పరిమితం కావడం వల్ల దారాన్ని అత్యధికంగా చైనాకు... దేశీయంగా తమిళనాడు,గుజరాత్, మహారాష్ట్రకు ఎగుమతి చేస్తున్నారు. చైనాతో సంబంధాలు దెబ్బతినడంతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. రోజుకు 50 కంటైనర్లు వరకు ఎగుమతి చేసే పరిశ్రమలు... ఇప్పుడు 10 కంటైనర్లకే పరిమితమయ్యాయి.

రాష్ట్రంలో వస్త్రాలు, ఇతర రెడీమేడ్ దుస్తులు తయారయ్యే ప్రొసెసింగ్, టెక్స్ టైల్ అపెరల్ పరిశ్రమలు పెద్దగా లేకపోవడం ఎప్పటి నుంచో లోటుగానే ఉంది. ప్రస్తుతం దారాన్ని మాత్రమే ఎగుమతి చేస్తుండగా.... వాల్యూ యాడెడ్ ఉత్పత్తులను అందిపుచ్చుకోలేక పోతున్నారు. టెక్నాలజీ అప్ గ్రేడెడ్ ఫండ్ కింద కేంద్రం గతంలో ఇచ్చిన రాయితీలు నిలిచిపోయాయి. ఐదేళ్లుగా రాష్ట్రం వైపు నుంచి విద్యుత్ రాయితీలు ఆగిపోయాయి. ఈ పరిస్థితుల్లో పరిశ్రమలు నూలు పరిశ్రమలు నడపడం వ్యాపారులకు కత్తిమీద సాములా మారింది.

ఇదీ చదవండి : ఎంపీ రామ్మోహన్​ నాయుడుకు సంసద్ రత్న అవార్డు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.