ETV Bharat / state

న్యాయవాది ఇంట్లో దాడులు.. రూ.75 వేలు విలువ చేసే మద్యం పట్టివేత

author img

By

Published : Aug 2, 2021, 4:42 PM IST

Updated : Aug 2, 2021, 4:50 PM IST

గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో నివాసముంటున్న మల్లాది నిరంజన్ బాబు అనే న్యాయవాది ఇంట్లో స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరో అధికారులు దాడులు నిర్వహించారు. ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన రూ.75 వేలు విలువ చేసే 5 కేసుల తెలంగాణ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి అరెస్ట్ చేశారు.

Liquor seized
మద్యం పట్టివేత

గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని ఆర్టీసీ బస్టాండ్ పక్క వీధిలోని సాయి గణేష్ టవర్స్ అపార్ట్​మెంట్​లో నివాసముంటున్న న్యాయవాది మల్లాది నిరంజన్ బాబు ఇంట్లో స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరో అధికారులు దాడులు నిర్వహించారు.

అక్రమంగా మద్యం విక్రయిస్తున్నట్లు సమాచారంతో దాడులు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో రూ.75 వేల విలువ చేసే 5 కేసుల తెలంగాణ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేశారు. దర్యాప్తులో నరసరావుపేటకు చెందిన వారి వద్ద నుంచి అతనికి మద్యం సరఫరా అయినట్లు గుర్తించామన్నారు. ఈ మేరకు వారి కోసం గాలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని ఆర్టీసీ బస్టాండ్ పక్క వీధిలోని సాయి గణేష్ టవర్స్ అపార్ట్​మెంట్​లో నివాసముంటున్న న్యాయవాది మల్లాది నిరంజన్ బాబు ఇంట్లో స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరో అధికారులు దాడులు నిర్వహించారు.

అక్రమంగా మద్యం విక్రయిస్తున్నట్లు సమాచారంతో దాడులు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో రూ.75 వేల విలువ చేసే 5 కేసుల తెలంగాణ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేశారు. దర్యాప్తులో నరసరావుపేటకు చెందిన వారి వద్ద నుంచి అతనికి మద్యం సరఫరా అయినట్లు గుర్తించామన్నారు. ఈ మేరకు వారి కోసం గాలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి

ఉద్దండరాయునిపాలెంలో ఉద్రిక్తత.. ఎస్సీ సంఘాలు, రాజధాని రైతుల అరెస్ట్

Last Updated : Aug 2, 2021, 4:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.