ETV Bharat / state

'కర్నూలులో హైకోర్టు వద్దు... రాజధానిగా అమరావతే ముద్దు' - latest news of amaravathi

అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. న్యాయవాదులు, రైతులు, తెదేపా నేతలు ఇలా అన్ని వర్గాల ప్రజలు ఆందోళన చేస్తున్నారు.

lawers dharna on capital issue
అమరావతినే రాజధానిగా కొనసాగించాలని న్యాయవాదుల ఆందోళన
author img

By

Published : Dec 27, 2019, 10:47 PM IST

అమరావతినే రాజధానిగా కొనసాగించాలని న్యాయవాదుల ఆందోళన

జగన్ చెప్పిన 3 రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రంలో నిరసనలు కొనసాగుతున్నాయి. కర్నూలులో హైకోర్టు వద్దని అమరావతినే రాజధానిగా ఉంచాలని న్యాయవాదుల జేఏసీ తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలో డిమాండ్ చేసింది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో మాజీ ఛైర్మన్ మోహన్ క్రేన్​కు వేలాడుతూ నిరసన తెలిపారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ తెదేపానేతలు ర్యాలీ చేశారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో రైతులకు మద్దతుగా తెదేపా శ్రేణులు ధర్నా చేశారు. రోడ్డుపై వంటావార్పు నిర్వహించారు. తుళ్లూరులో రైతులు చేస్తున్న ఆందోళనను పోలీసులు అడ్డుకుని మంగళగిరి స్టేషన్​కు తరలించారు. రాజధాని ప్రాంత రైతులకు న్యాయవాదుల జేఏసీ మద్దతు తెలిపింది

అమరావతినే రాజధానిగా కొనసాగించాలని న్యాయవాదుల ఆందోళన

జగన్ చెప్పిన 3 రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రంలో నిరసనలు కొనసాగుతున్నాయి. కర్నూలులో హైకోర్టు వద్దని అమరావతినే రాజధానిగా ఉంచాలని న్యాయవాదుల జేఏసీ తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలో డిమాండ్ చేసింది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో మాజీ ఛైర్మన్ మోహన్ క్రేన్​కు వేలాడుతూ నిరసన తెలిపారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ తెదేపానేతలు ర్యాలీ చేశారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో రైతులకు మద్దతుగా తెదేపా శ్రేణులు ధర్నా చేశారు. రోడ్డుపై వంటావార్పు నిర్వహించారు. తుళ్లూరులో రైతులు చేస్తున్న ఆందోళనను పోలీసులు అడ్డుకుని మంగళగిరి స్టేషన్​కు తరలించారు. రాజధాని ప్రాంత రైతులకు న్యాయవాదుల జేఏసీ మద్దతు తెలిపింది

ఇదీ చూడండి

మూడో తేదీ తరువాతే రాజధానిపై నిర్ణయం

Intro:కర్నూలులో హైకోర్టు వద్దు...న్యాయవాదులు నిరసన:
కర్నూలులో హైకోర్టు వద్దని అమరావతిలోనే ఉంచాలని న్యాయవాదుల జేఏసీ డిమాండ్ చేశారు. రాష్ట్ర న్యాయవాదుల జేఏసీ పిలుపు మేరకు తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలో జ్యూడిషియల్ ఫస్టుక్లాస్ కోర్ట్ ఆవరణలో ఉన్న న్యాయ విజ్ఞాన కేంద్రం ఎదుట న్యాయవాదులు ఆందోళన చేసి విధులను బహిష్కరించారు. ఈ సందర్భంగా న్యాయవాదుల జేఏసీ నాయకుడు భగవాన్ మాట్లాడుతూ కర్నూలులో హైకోర్టు పెట్టడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. అమరావతిలో హైకోర్టును ఏర్పాటు చేసి రాజమహేంద్రవరంలో బెంచ్ ఏర్పాటు చేయాలన్నారు. ఈ ఆందోళనలో న్యాయవాదులు పాల్గొన్నారు.


Body:కె.వెంకటరమణ, ఈటీవీ భారత్, కంట్రిబ్యూటర్, రంపచోడవరం.


Conclusion:9490877172
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.