ETV Bharat / state

కుంకలగుంటలో జనసేన నేతల ఆందోళన

author img

By

Published : Apr 8, 2021, 5:41 PM IST

గుంటూరు జిల్లా కుంకలగుంటలో జనసేన నేతలు ఆందోళన చేశారు. ఎన్నికల్లో వైకాపా నేతలు రిగ్గింగ్​కు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ... ప్రధాన రహదారిపై బైఠాయించారు.

janasena leaders protest at kunkalagunta guntur district
కుంకలగుంటలో జనసేన నేతల ఆందోళన

గుంటూరు జిల్లా నకరికల్లు మండలం కుంకలగుంట గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలోని 41వ పోలింగ్ కేంద్రంలో జరుగుతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో వైకాపా నాయకులు రిగ్గింగ్ కు పాల్పడ్డారని జనసేన నేతలు ఆరోపించారు.

ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెళ్తున్న తమను వైకాపా, తెదేపా శ్రేణులు అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై తమకు న్యాయం చేయాలంటూ.. గ్రామంలోని ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన చేశారు. సమాచారం అందుకున్న నకరికల్లు పోలీసులు పరిస్థితి చక్కదిద్దే ప్రయత్నం చేశారు.

గుంటూరు జిల్లా నకరికల్లు మండలం కుంకలగుంట గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలోని 41వ పోలింగ్ కేంద్రంలో జరుగుతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో వైకాపా నాయకులు రిగ్గింగ్ కు పాల్పడ్డారని జనసేన నేతలు ఆరోపించారు.

ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెళ్తున్న తమను వైకాపా, తెదేపా శ్రేణులు అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై తమకు న్యాయం చేయాలంటూ.. గ్రామంలోని ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన చేశారు. సమాచారం అందుకున్న నకరికల్లు పోలీసులు పరిస్థితి చక్కదిద్దే ప్రయత్నం చేశారు.

ఇదీ చదవండి:

రోజుకు 6 లక్షల మందికి కరోనా టీకా వేసేలా ఏర్పాట్లు: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.