గుంటూరు జిల్లా తెనాలిలో నిజాంపట్నం కాలువకి తూర్పు వైపున్న కాలువలో.. శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న సందర్భంలో డెల్టా రైతాంగానికి అవసరమైన సాగునీరు, తాగునీరు అందించేందుకు ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్.. తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఇందుకు శ్రీకారం చుట్టారు. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు శుద్ధి చేశారు. రాబోయే రోజుల్లో కాలువల్లో చెత్త లేకుండా చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ చెప్పారు.
ఇదీ చదవండి: