స్థానిక ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాలని తెలుగుదేశం పిలుపునిచ్చింది. గుంటూరు జిల్లాలో పార్టీ అభ్యర్థుల ఎంపిక, పార్టీ వ్యూహంపై చర్చించేందుకు సమావేశమైన నేతలు...9నెలల పాలనపై స్థానిక ఎన్నికల వేదికగా స్పందించాలని ప్రజలను కోరారు. ఇంతవేగంగా ఎన్నికలు జరపడంలో కుట్ర దాగిఉందని..అభ్యర్థులు కనీసం కుల ధ్రువీకరణపత్రం పొందే సమయం ఇవ్వకుండానే ఎన్నికలు నిర్వహిస్తున్నారని నేతలు ఆరోపించారు. ఓటమి భయంతోనే బీసీలను పోటీకి దూరం చేశారని ధ్వజమెత్తారు.
ఇదీచదవండి
'స్థానిక ఎన్నికల్లో బీసీల ప్రాతినిథ్యం తగ్గించేందుకే తంటాలు'