ETV Bharat / state

'విశాఖ ఘటనలో వారి చొరవ అభినందనీయం'

author img

By

Published : May 8, 2020, 9:31 PM IST

విశాఖ ఘటనపై విచారణ కమిటీని నియమించామని హోంమంత్రి సుచరిత స్పష్టం చేశారు. బాధితులను కాపాడేందుకు పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, స్థానిక యువత చూపిన చొరవ అభినందనీయమన్నారు.

'విశాఖ ఘటనలో వారి చొరవ అభినందనీయం'
'విశాఖ ఘటనలో వారి చొరవ అభినందనీయం'

విశాఖలో జరిగిన విషవాయువు ప్రమాదంలో బాధితులను కాపాడేందుకు పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, స్థానిక యువత చూపిన చొరవ అభినందనీయమని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత కొనియాడారు. గ్యాస్ లీకేజి ప్రమాదంపై ప్రభుత్వం విచారణ కమిటీని నియమించినట్టు వివరించారు. నివేదికను బట్టి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. పరిశ్రమ ఏర్పాటు తర్వాత అక్కడ జనాభా పెరిగిందన్న సుతరిత... అక్కడి నుంచి పరిశ్రమ తరలించే విషయాన్ని పరిశీలిస్తామని తెలిపారు.

ఘటనపై విపక్షనేతలు లేనిపోని ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి ఘటనలు జరిగినపుడు సంయమనంతో ఉండాలన్నారు.

విశాఖలో జరిగిన విషవాయువు ప్రమాదంలో బాధితులను కాపాడేందుకు పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, స్థానిక యువత చూపిన చొరవ అభినందనీయమని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత కొనియాడారు. గ్యాస్ లీకేజి ప్రమాదంపై ప్రభుత్వం విచారణ కమిటీని నియమించినట్టు వివరించారు. నివేదికను బట్టి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. పరిశ్రమ ఏర్పాటు తర్వాత అక్కడ జనాభా పెరిగిందన్న సుతరిత... అక్కడి నుంచి పరిశ్రమ తరలించే విషయాన్ని పరిశీలిస్తామని తెలిపారు.

ఘటనపై విపక్షనేతలు లేనిపోని ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి ఘటనలు జరిగినపుడు సంయమనంతో ఉండాలన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.