ETV Bharat / state

తస్మాత్ జాగ్రత్త.. రెండో దఫా రెట్టింపు కావచ్చు

author img

By

Published : Nov 8, 2020, 9:18 AM IST

ఇప్పుడిప్పుడే కరోనా తగ్గుముఖం పడుతోంది. జనజీవనం అన్​లాక్​ అవుతుంది. అయితే ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే.. కరోనా రెండో దఫా రూపంలో అసలు ముంపు ముందుంది తస్మాత్ జాగ్రత్త అంటున్నారు నిపుణులు. అయినప్పటికీ ఇవేవీ పట్టని జనం కరోనా నివారణ నియమాలు మరిచి.. యధావిథిగా పనుల్లో నిమగ్నమవుతున్నారు. దీంతో అప్రమత్తమైన అధికారులు కరోనా నియంత్రణ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలని యోచిస్తున్నారు.

gutntur muncipal corporation
కరోనా నియంత్రణపై అధికారుల అవగాహన ర్యాలీలు

ఓ వైపు కరోనా సెకండ్ వేవ్ అంటూ నిపుణుల హెచ్ఛరికలు చేస్తుంటే.. మరోవైపు ప్రజలు మాత్రం ఇవేవీ పట్టించుకోవడం లేదు. ఈ తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటున్నారు వైద్యులు. అందుకే గుంటూరు నగరపాలక సంస్థ కరోనా నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలని నిర్ణయించింది. నియమాలు ఉల్లంఘించిన వారికి కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

కరోనా లాక్​డౌన్ కొద్ది కొద్దిగా తెరుచుకోవడంతో జనం మళ్లీ యధావిథిగా రోడ్లపైకి వచ్చేశారు. సభలు, సమావేశాలు, షాపింగ్​లు అంటూ కార్యకలపాలు కొనసాగిస్తున్నారు. అయితే వీటిలో ఎక్కడా కూడా భౌతికదూరం... మాస్కులు ధరించడం వంటివి కనిపించకపోవడం భయాందోళన కలిస్తోంది. ఇక కరోనా ప్రారంభమైనప్పటి నుంచి కేసులు ఎక్కువగా వస్తోన్న గుంటూరు జిల్లాలో ఇలాంటి పరిస్థితి కనిపించడం అధికారుల్లో ఆందోళన మొదలైంది. దీంతో నియంత్రణ చర్యల్లో భాగంగా పలు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు.

జిల్లాలో ఇప్పటివరకు 70వేలు కేసులు దాటగా... వాటిల్లో 20వేలు కేసులు నగరంలో నమోదైనవే. లాక్ డౌన్ సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉన్నప్పటికీ అన్ లాక్ మొదలయ్యాక క్రమేపీ అప్రమత్తత తగ్గుతోంది. కొందరు మాస్కులు ఉన్నా గొంతుపైకి వేలాడదీస్తున్నారే తప్ప.. క్రమంగా మాస్కులు ధరించడం లేదు. ద్విచక్ర వాహనాలపై ఇద్దరు కలిసి వెళ్తున్నప్పుడు మాస్క్ ధరించటం లేదు. దీంతో ఇద్దరిలో ఎవరికి వైరస్ ఉన్నా రెండో వారికి సులువుగా వైరస్​ సోకే ప్రమాదం లేకపోలేదు.

మాస్క్ ధరించకుండా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనటం కరోనాని ఆహ్వానించినట్లేనని నిపుణులు, అధికారులు హెచ్ఛరిస్తున్నారు. ఇవన్నీ కూడా వైరస్ వ్యాప్తికి కారణంగా మారాయి. ఇతర దేశాల్లో కరోనా సెకండ్ వేవ్ మొదలైందని... దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉందని నిపుణులు హెచ్ఛరిస్తున్నారు. కరోనా మొదటి ఉధృతితోనే ఆర్థికంగా చాలా నష్టపోయామని... దాని నుంచి కోలుకోకుండానే సెకండ్ వేవ్ ని కొని తెచ్చుకోవద్దంటు సూచిస్తున్నారు.

ఇవీ చూడండి...

జిల్లాలో కొత్తగా 226 మందికి కరోనా పాజిటివ్

ఓ వైపు కరోనా సెకండ్ వేవ్ అంటూ నిపుణుల హెచ్ఛరికలు చేస్తుంటే.. మరోవైపు ప్రజలు మాత్రం ఇవేవీ పట్టించుకోవడం లేదు. ఈ తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటున్నారు వైద్యులు. అందుకే గుంటూరు నగరపాలక సంస్థ కరోనా నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలని నిర్ణయించింది. నియమాలు ఉల్లంఘించిన వారికి కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

కరోనా లాక్​డౌన్ కొద్ది కొద్దిగా తెరుచుకోవడంతో జనం మళ్లీ యధావిథిగా రోడ్లపైకి వచ్చేశారు. సభలు, సమావేశాలు, షాపింగ్​లు అంటూ కార్యకలపాలు కొనసాగిస్తున్నారు. అయితే వీటిలో ఎక్కడా కూడా భౌతికదూరం... మాస్కులు ధరించడం వంటివి కనిపించకపోవడం భయాందోళన కలిస్తోంది. ఇక కరోనా ప్రారంభమైనప్పటి నుంచి కేసులు ఎక్కువగా వస్తోన్న గుంటూరు జిల్లాలో ఇలాంటి పరిస్థితి కనిపించడం అధికారుల్లో ఆందోళన మొదలైంది. దీంతో నియంత్రణ చర్యల్లో భాగంగా పలు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు.

జిల్లాలో ఇప్పటివరకు 70వేలు కేసులు దాటగా... వాటిల్లో 20వేలు కేసులు నగరంలో నమోదైనవే. లాక్ డౌన్ సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉన్నప్పటికీ అన్ లాక్ మొదలయ్యాక క్రమేపీ అప్రమత్తత తగ్గుతోంది. కొందరు మాస్కులు ఉన్నా గొంతుపైకి వేలాడదీస్తున్నారే తప్ప.. క్రమంగా మాస్కులు ధరించడం లేదు. ద్విచక్ర వాహనాలపై ఇద్దరు కలిసి వెళ్తున్నప్పుడు మాస్క్ ధరించటం లేదు. దీంతో ఇద్దరిలో ఎవరికి వైరస్ ఉన్నా రెండో వారికి సులువుగా వైరస్​ సోకే ప్రమాదం లేకపోలేదు.

మాస్క్ ధరించకుండా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనటం కరోనాని ఆహ్వానించినట్లేనని నిపుణులు, అధికారులు హెచ్ఛరిస్తున్నారు. ఇవన్నీ కూడా వైరస్ వ్యాప్తికి కారణంగా మారాయి. ఇతర దేశాల్లో కరోనా సెకండ్ వేవ్ మొదలైందని... దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉందని నిపుణులు హెచ్ఛరిస్తున్నారు. కరోనా మొదటి ఉధృతితోనే ఆర్థికంగా చాలా నష్టపోయామని... దాని నుంచి కోలుకోకుండానే సెకండ్ వేవ్ ని కొని తెచ్చుకోవద్దంటు సూచిస్తున్నారు.

ఇవీ చూడండి...

జిల్లాలో కొత్తగా 226 మందికి కరోనా పాజిటివ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.