ETV Bharat / state

'పంచాయతీ ఎన్నికల నిర్వహణకు చర్యలు'

author img

By

Published : Jan 28, 2021, 9:36 AM IST

పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి అన్నారు. చేబ్రోలు స్థానిక పోలీస్​స్టేషన్​లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

guntur urban sp ammireddy
గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి

స్థానిక ఎన్నికలు సజావుగా సాగేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి చెప్పారు. చేబ్రోలు పోలీస్​స్టేషన్​లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అర్బన్ పరిధిలో తొలి విడత ఎన్నికలు చేబ్రోలు మండలంలో మాత్రమే ఉన్నాయని తెలిపారు. అక్కడ అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. త్వరలోనే మిగిలిన మండలాల్లో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేస్తామని చెప్పారు.

మండలంలో 29 మంది రౌడీషీటర్లను బైండోవర్ చేశామని చెప్పారు. మంచాల, నారాకోడూరు, గరువుపాలెం గ్రామాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. అనుమానాస్పద వ్యక్తులు రాకుండా నిరోధించటంతో పాటు గ్రావెల్, ఇసుక, మట్టి అక్రమ తరలింపును నిలువరిస్తామని చెప్పారు. కార్యక్రమంలో తెనాలి డీఎస్పీ, జేసీ ప్రశాంతి మధుసూదన్ రావు, ఎస్సై కిషోర్ పాల్గొన్నారు.

స్థానిక ఎన్నికలు సజావుగా సాగేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి చెప్పారు. చేబ్రోలు పోలీస్​స్టేషన్​లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అర్బన్ పరిధిలో తొలి విడత ఎన్నికలు చేబ్రోలు మండలంలో మాత్రమే ఉన్నాయని తెలిపారు. అక్కడ అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. త్వరలోనే మిగిలిన మండలాల్లో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేస్తామని చెప్పారు.

మండలంలో 29 మంది రౌడీషీటర్లను బైండోవర్ చేశామని చెప్పారు. మంచాల, నారాకోడూరు, గరువుపాలెం గ్రామాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. అనుమానాస్పద వ్యక్తులు రాకుండా నిరోధించటంతో పాటు గ్రావెల్, ఇసుక, మట్టి అక్రమ తరలింపును నిలువరిస్తామని చెప్పారు. కార్యక్రమంలో తెనాలి డీఎస్పీ, జేసీ ప్రశాంతి మధుసూదన్ రావు, ఎస్సై కిషోర్ పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

గ్రామాల్ని దోచుకునేందుకే ఏకగ్రీవాల జపం: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.