ETV Bharat / state

Allotment of Places: ఇళ్ల స్థలాల కేటాయింపులో మొండిపట్టు విడవని ప్రభుత్వం.. స్థలాల పంపిణీకి చర్యలు - amaravati latest news

Allotment of Places for People In Capital: రాజధాని భూముల్లో ఇళ్ల స్థలాల కేటాయింపు వ్యవహారంలో.. అమరావతి రైతుల అభ్యంతరాలను పట్టించుకోకుండా ప్రభుత్వం మొండిగా ముందుకెళ్తోంది. న్యాయస్థానం పరిధిలో కేసు విచారణలో ఉన్నప్పటికీ.. ఇళ్లస్థలాల పంపిణీకి సర్కారు చర్యలు చేపట్టింది. ఆర్-5 జోన్‌ను వ్యతిరేకిస్తూ.. వివిధ రూపాల్లో నిరసనలు తెలిపిన రైతులు.. నేడు రానున్న కోర్టు తీర్పుని అనుసరించి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామంటున్నారు.

high court
high court
author img

By

Published : May 3, 2023, 8:11 AM IST

Government Actions for Allotment of Places: అమరావతి ఆర్-5 జోన్‌ ప్రాంతంలో.. గుంటూరు, NTR జిల్లాలకు చెందిన పేదలకు సెంటు చొప్పున ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటికే రెండు జిల్లాల అధికార యంత్రాంగం 49 వేల మంది లబ్ధిదారులను గుర్తించటంతో పాటు.. వారి పేర్లతో ఇళ్ల ప్లాట్లకు సంబంధించిన పుస్తకాలను ముద్రించింది. ఇళ్ల పట్టాలను సంబంధిత రెవిన్యూ అధికారులకు అందజేశారు. తదుపరి ప్రక్రియ కోసం జిల్లా యంత్రాంగం క్షేత్రస్థాయిలో పని ప్రారంభించింది. గతంలోని లబ్ధిదారుల జాబితాలను పరిశీలించిన రెవెన్యూ అధికారులు అర్హులకు పట్టాలిచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

NTR జిల్లాలో 24 వేల మంది, గుంటూరు జిల్లా పరిధిలో 25 వేల మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరిలో తుళ్లూరు మండలం నుంచి కేవలం 1340 మంది మాత్రమే లబ్ధిదారులు ఉన్నారు. జాబితాలను రెండేళ్ల క్రితమే ప్రభుత్వం రూపొందించినా అప్పట్లో కోర్టు తీర్పుతో ఇళ్ల పట్టాల పంపిణీ నిలిచిపోయింది. ఆ తర్వాత ప్రభుత్వం ఆర్-5 జోన్ ఏర్పాటు చేసి.. గెజిట్ జారీ చేసిన అనంతరం మళ్లీ పట్టాల పంపిణీ ప్రక్రియ చేపట్టింది. దీనిని రాజధాని రైతులు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. ‍

"ఆర్​5 జోన్​ను ప్రశ్నిస్తూ కోర్టుకు వెళ్లాం. అలాగే జీవో నెం 45ను ప్రశ్నిస్తూ కోర్టుకెళ్లాం. వాటిపై హైకోర్టు విచారణ చేపడుతోంది. కానీ ప్రభుత్వానికి అత్యుత్సాహం ఎక్కువైంది. ఎందుకంటే హైకోర్టు కాని, సుప్రీంకోర్టు కాని తమ వాదనలు ఎక్కడ కొట్టివేస్తాయో అనే భయం. వైసీపీ లక్ష్యం ఒక్కటే.. అధికారం కోల్పోయినా కానీ అమరావతి రాజధానిని నాశనం చేయాలని"-రాజధాని రైతులు

తుళ్లూరు, మంగళగిరి మండలాల్లోని 7 గ్రామాల పరిధిలో వెయ్యి ఎకరాలకు పైగా భూములను ప్లాట్ల కోసం సిద్ధం చేస్తున్నారు. కంప చెట్ల తొలగించి లే అవుట్లు సిద్ధం చేశారు. హామీ పత్రాలు ఇచ్చిన వారి పేర్లతో వచ్చిన ఇళ్ల పట్టాల్లో లే అవుట్‌ నంబర్‌, సర్వే నంబర్‌, ప్లాటు నంబర్‌, సరిహద్దుల సమాచారాన్ని నమోదు చేశారు. ఆర్‌- 5 జోన్‌ లే అవుట్ల ఆధారంగా ప్లాట్ల కేటాయింపు ప్రక్రియ చేస్తున్నారు. ఇది పూర్తయిన వెంటనే లబ్ధిదారులకు పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆర్- 5 జోన్ విషయంలో తాము ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోందని రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమరావతిని దెబ్బతీసే కుట్రలో భాగంగానే జగన్‌ ప్రభుత్వం ఎత్తుగడలు వేస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు.

"న్యాయస్థానంలో విచారణ జరుగుతుంటే ప్రభుత్వం ముందుకు వెళుతూ కంపచెట్లు తొలిగించడం ఎంతవరకు కరెక్ట్​. అంతకుముందు 107 జీవో తీసుకొచ్చారు. దానిని సుప్రీంకోర్టు కొట్టివేసింది. దానిపై హైకోర్టుకు వెళ్లిన ఎదురుదెబ్బె తగిలింది. దానిని 45 జీవో కింద తీసుకొచ్చారు. అది ఎలా చెల్లుబాటు అవుతుంది"-రాజధాని రైతులు

ఇళ్ల స్థలాల కేటాయింపులో మొండిపట్టు విడవని ప్రభుత్వం.. స్థలాల పంపిణీకి చర్యలు

ఇవీ చదవండి:

Government Actions for Allotment of Places: అమరావతి ఆర్-5 జోన్‌ ప్రాంతంలో.. గుంటూరు, NTR జిల్లాలకు చెందిన పేదలకు సెంటు చొప్పున ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటికే రెండు జిల్లాల అధికార యంత్రాంగం 49 వేల మంది లబ్ధిదారులను గుర్తించటంతో పాటు.. వారి పేర్లతో ఇళ్ల ప్లాట్లకు సంబంధించిన పుస్తకాలను ముద్రించింది. ఇళ్ల పట్టాలను సంబంధిత రెవిన్యూ అధికారులకు అందజేశారు. తదుపరి ప్రక్రియ కోసం జిల్లా యంత్రాంగం క్షేత్రస్థాయిలో పని ప్రారంభించింది. గతంలోని లబ్ధిదారుల జాబితాలను పరిశీలించిన రెవెన్యూ అధికారులు అర్హులకు పట్టాలిచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

NTR జిల్లాలో 24 వేల మంది, గుంటూరు జిల్లా పరిధిలో 25 వేల మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరిలో తుళ్లూరు మండలం నుంచి కేవలం 1340 మంది మాత్రమే లబ్ధిదారులు ఉన్నారు. జాబితాలను రెండేళ్ల క్రితమే ప్రభుత్వం రూపొందించినా అప్పట్లో కోర్టు తీర్పుతో ఇళ్ల పట్టాల పంపిణీ నిలిచిపోయింది. ఆ తర్వాత ప్రభుత్వం ఆర్-5 జోన్ ఏర్పాటు చేసి.. గెజిట్ జారీ చేసిన అనంతరం మళ్లీ పట్టాల పంపిణీ ప్రక్రియ చేపట్టింది. దీనిని రాజధాని రైతులు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. ‍

"ఆర్​5 జోన్​ను ప్రశ్నిస్తూ కోర్టుకు వెళ్లాం. అలాగే జీవో నెం 45ను ప్రశ్నిస్తూ కోర్టుకెళ్లాం. వాటిపై హైకోర్టు విచారణ చేపడుతోంది. కానీ ప్రభుత్వానికి అత్యుత్సాహం ఎక్కువైంది. ఎందుకంటే హైకోర్టు కాని, సుప్రీంకోర్టు కాని తమ వాదనలు ఎక్కడ కొట్టివేస్తాయో అనే భయం. వైసీపీ లక్ష్యం ఒక్కటే.. అధికారం కోల్పోయినా కానీ అమరావతి రాజధానిని నాశనం చేయాలని"-రాజధాని రైతులు

తుళ్లూరు, మంగళగిరి మండలాల్లోని 7 గ్రామాల పరిధిలో వెయ్యి ఎకరాలకు పైగా భూములను ప్లాట్ల కోసం సిద్ధం చేస్తున్నారు. కంప చెట్ల తొలగించి లే అవుట్లు సిద్ధం చేశారు. హామీ పత్రాలు ఇచ్చిన వారి పేర్లతో వచ్చిన ఇళ్ల పట్టాల్లో లే అవుట్‌ నంబర్‌, సర్వే నంబర్‌, ప్లాటు నంబర్‌, సరిహద్దుల సమాచారాన్ని నమోదు చేశారు. ఆర్‌- 5 జోన్‌ లే అవుట్ల ఆధారంగా ప్లాట్ల కేటాయింపు ప్రక్రియ చేస్తున్నారు. ఇది పూర్తయిన వెంటనే లబ్ధిదారులకు పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆర్- 5 జోన్ విషయంలో తాము ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోందని రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమరావతిని దెబ్బతీసే కుట్రలో భాగంగానే జగన్‌ ప్రభుత్వం ఎత్తుగడలు వేస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు.

"న్యాయస్థానంలో విచారణ జరుగుతుంటే ప్రభుత్వం ముందుకు వెళుతూ కంపచెట్లు తొలిగించడం ఎంతవరకు కరెక్ట్​. అంతకుముందు 107 జీవో తీసుకొచ్చారు. దానిని సుప్రీంకోర్టు కొట్టివేసింది. దానిపై హైకోర్టుకు వెళ్లిన ఎదురుదెబ్బె తగిలింది. దానిని 45 జీవో కింద తీసుకొచ్చారు. అది ఎలా చెల్లుబాటు అవుతుంది"-రాజధాని రైతులు

ఇళ్ల స్థలాల కేటాయింపులో మొండిపట్టు విడవని ప్రభుత్వం.. స్థలాల పంపిణీకి చర్యలు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.