ETV Bharat / state

ఇదో అమ్మాయి బాధితుడి కథ!

author img

By

Published : Mar 4, 2020, 5:27 PM IST

మామూలుగా అయితే.. అమ్మాయిని అబ్బాయి వేధిస్తున్నాడనే ఫిర్యాదులే ఎక్కువగా వస్తుంటాయి. కానీ.. ఇక్కడ ఓ అమ్మాయి.. అబ్బాయిని టార్గెట్ చేసిందట. పెళ్లి చేసుకోకుంటే చంపేస్తామంటూ ఆమె బంధువులూ బెదిరిస్తున్నారట. అసలేం జరిగింది? ఎక్కడ జరిగింది?

girl-warning-to-boy
girl-warning-to-boy

ఫేస్ బుక్ స్నేహం... ఓ అబ్బాయి ఆత్మహత్యాయత్నం చేసుకునే వరకూ దారి తీసింది. గుంటూరులో వెలుగు చూసిన ఈ ఘటన.. సామాజిక మాధ్యమాల ప్రభావం యువతపై ఎలా పడుతోందన్నదీ స్పష్టం చేస్తోంది. ఓ అమ్మాయి.. ఓ అబ్బాయికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి.. తర్వాత స్నేహం చేసి.. ఆఖరికి పెళ్లి చేసుకోవాలని బెదిరించడమే కాదు.. పెళ్లి చేసుకోకుంటే చంపేస్తానని భయపెట్టిందని బాధితుడి తల్లి పోలీసులను ఆశ్రయించింది.

వివరాల్లోకి వెళితే..

గుంటూరుకు చెందిన ఓ యువకుడు బీఎస్సీ చదువుతున్నాడు. ఇటీవల వినుకొండకు చెందిన ఓ యువతి ఫేస్‌బుక్‌లో అతనికి ఫ్రెండ్‌ రిక్వెస్టు పంపగా.. అతను ఓకే చేశాడు. ఇద్దరి మధ్య 3 నెలలుగా ఛాటింగ్‌ నడిచింది.

అకస్మాత్తుగా:

బాధిత కుటుంబం చెబుతున్న ప్రకారం... సదరు యువతి నెల క్రితం.. ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుందామని అడిగింది. "మనం స్నేహితులమే కదా.. మరి పెళ్లి అంటావేంటి?" అని అతను ప్రశ్నించాడు. దీనికి ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ వివాహం చేసుకోకపోతే చంపేస్తానంటూ బెదిరించింది. ఆ యువకుడు భయపడిపోయాడు. జరిగిన విషయాన్ని తన తల్లికి వివరంగా చెప్పాడు.

ఒకే ఒక్కడు:

బాధితుడి తల్లికి ఒక్కడే కుమారుడు. అతడిపైనా ఆమె ఆశలన్నీ. తన రెక్కల కష్టంతో చదివిస్తోంది. అకస్మాత్తుగా తన కుమారుడ్ని చంపేస్తామని ఓ అమ్మాయి నుంచి బెదిరింపు రావడంపై ఆందోళనకు గురైంది. అమ్మాయి తల్లిదండ్రులను కలిసి విషయాన్ని వివరించింది.

కథ అడ్డం తిరిగి:

అమ్మాయి తల్లిదండ్రులు కూడా సీన్ రిపీట్ చేశారు. "మీ అబ్బాయిని మా పాప ఇష్టపడింది. కాబట్టి పెళ్లి చేసుకోవాల్సిందే. లేదంటే మీ అబ్బాయిని చంపేస్తాం" అని వారూ హెచ్చరించారు.

ఆసుపత్రికి చేరి:

తన తల్లి వెళ్లి మాట్లాడినా సమస్య పరిష్కారం కాకపోవడంపై సదరు యువకుడు ఆందోళన చెందాడు. మత్తు మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయినా ఆ అమ్మాయితోపాటు ఆమె తల్లిదండ్రులు ఫోన్‌ చేసి బెదిరింపులు కొనసాగిస్తూనే ఉన్నారని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది.

ఎస్పీని ఆశ్రయించి:

యువకుడి తల్లి సోమవారం గుంటూరులో జరిగిన స్పందన కార్యక్రమంలో ఎస్పీని ఆశ్రయించింది. తన కుమారుడి సమస్యను వివరించింది. ఆ అమ్మాయి, ఆమె తల్లిదండ్రుల బారి నుంచి కాపాడాలని వేడుకుంది. తమకు రక్షణ కల్పించి, న్యాయం చేయాలని కన్నీరు పెట్టుకుంది. విషయాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలపై ఆరా తీస్తున్నారు.

ఇదీ చదవండి:

పాఠాలు చెప్పాల్సిన గురువే.. పాడు పని చేశాడు!

ఫేస్ బుక్ స్నేహం... ఓ అబ్బాయి ఆత్మహత్యాయత్నం చేసుకునే వరకూ దారి తీసింది. గుంటూరులో వెలుగు చూసిన ఈ ఘటన.. సామాజిక మాధ్యమాల ప్రభావం యువతపై ఎలా పడుతోందన్నదీ స్పష్టం చేస్తోంది. ఓ అమ్మాయి.. ఓ అబ్బాయికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి.. తర్వాత స్నేహం చేసి.. ఆఖరికి పెళ్లి చేసుకోవాలని బెదిరించడమే కాదు.. పెళ్లి చేసుకోకుంటే చంపేస్తానని భయపెట్టిందని బాధితుడి తల్లి పోలీసులను ఆశ్రయించింది.

వివరాల్లోకి వెళితే..

గుంటూరుకు చెందిన ఓ యువకుడు బీఎస్సీ చదువుతున్నాడు. ఇటీవల వినుకొండకు చెందిన ఓ యువతి ఫేస్‌బుక్‌లో అతనికి ఫ్రెండ్‌ రిక్వెస్టు పంపగా.. అతను ఓకే చేశాడు. ఇద్దరి మధ్య 3 నెలలుగా ఛాటింగ్‌ నడిచింది.

అకస్మాత్తుగా:

బాధిత కుటుంబం చెబుతున్న ప్రకారం... సదరు యువతి నెల క్రితం.. ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుందామని అడిగింది. "మనం స్నేహితులమే కదా.. మరి పెళ్లి అంటావేంటి?" అని అతను ప్రశ్నించాడు. దీనికి ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ వివాహం చేసుకోకపోతే చంపేస్తానంటూ బెదిరించింది. ఆ యువకుడు భయపడిపోయాడు. జరిగిన విషయాన్ని తన తల్లికి వివరంగా చెప్పాడు.

ఒకే ఒక్కడు:

బాధితుడి తల్లికి ఒక్కడే కుమారుడు. అతడిపైనా ఆమె ఆశలన్నీ. తన రెక్కల కష్టంతో చదివిస్తోంది. అకస్మాత్తుగా తన కుమారుడ్ని చంపేస్తామని ఓ అమ్మాయి నుంచి బెదిరింపు రావడంపై ఆందోళనకు గురైంది. అమ్మాయి తల్లిదండ్రులను కలిసి విషయాన్ని వివరించింది.

కథ అడ్డం తిరిగి:

అమ్మాయి తల్లిదండ్రులు కూడా సీన్ రిపీట్ చేశారు. "మీ అబ్బాయిని మా పాప ఇష్టపడింది. కాబట్టి పెళ్లి చేసుకోవాల్సిందే. లేదంటే మీ అబ్బాయిని చంపేస్తాం" అని వారూ హెచ్చరించారు.

ఆసుపత్రికి చేరి:

తన తల్లి వెళ్లి మాట్లాడినా సమస్య పరిష్కారం కాకపోవడంపై సదరు యువకుడు ఆందోళన చెందాడు. మత్తు మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయినా ఆ అమ్మాయితోపాటు ఆమె తల్లిదండ్రులు ఫోన్‌ చేసి బెదిరింపులు కొనసాగిస్తూనే ఉన్నారని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది.

ఎస్పీని ఆశ్రయించి:

యువకుడి తల్లి సోమవారం గుంటూరులో జరిగిన స్పందన కార్యక్రమంలో ఎస్పీని ఆశ్రయించింది. తన కుమారుడి సమస్యను వివరించింది. ఆ అమ్మాయి, ఆమె తల్లిదండ్రుల బారి నుంచి కాపాడాలని వేడుకుంది. తమకు రక్షణ కల్పించి, న్యాయం చేయాలని కన్నీరు పెట్టుకుంది. విషయాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలపై ఆరా తీస్తున్నారు.

ఇదీ చదవండి:

పాఠాలు చెప్పాల్సిన గురువే.. పాడు పని చేశాడు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.