ETV Bharat / state

చిలకలూరిపేటలో పేలుడు... టపాసుల తయారీనే కారణమా !

గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో జరిగిన గ్యాస్ పేలుడు పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ విషాదంలో ఇద్దరు మృతి చెందగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటనా స్థలంలో టపాసులను గుర్తించటంతో...బాణాసంచా తయారు చేస్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

author img

By

Published : Oct 1, 2019, 8:41 PM IST

చిలకలూరిపేటలో పేలుడు... టపాసులే తయారీనే కారణమా !
చిలకలూరిపేటలో పేలుడు... టపాసుల తయారీనే కారణమా !

గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో గ్యాస్‌ సిలిండర్ పేలి ఇద్దరు మహిళలు మృతిచెందగా... మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక ఎన్టీఆర్ కాలనీలో నివాసం ఉండే నాగార్జున ఇంట్లో పేలుడు సంభవించింది. పేలుడు తీవ్రతకు రేకుల ఇళ్లు పూర్తిగా ధ్వంసమైంది. చనిపోయిన వారి శరీర భాగాలు పక్కనే ఉన్న పార్కులో చెల్లాచెదురుగా పడిపోయాయి.

ఇద్దరు మృతి... మరొకరి పరిస్థితి విషమం....
భారీ శబ్దంతో పేలుడు సంభవించడం వల్ల చుట్టుపక్కల వారు బాంబు పేలుడుగా భావించినట్లు తెలిపారు. ఈ ఘటనలో నాగార్జున కుటుంబానికి సన్నిహితురాలైన దివ్య అక్కడికక్కడే చనిపోయింది. భార్య ఆదిలక్ష్మి ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన నాగార్జున, కుమార్తె శృతి, నాయనమ్మ గురుస్వామిని చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నాగార్జున పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు.

టపాసులు తయారీనే కారణమా...!
గ్యాస్ సిలిండర్ పేలిన కారణంగానే ప్రమాదం జరిగిందని నాగార్జున కుటుంబ సభ్యులు చెబుతుండగా... సంఘటనాస్థలంలో టపాసులు దొరకడం పలు అనుమానాలకు తావిస్తోంది. బాణాసంచా తయారీ చేస్తుండగా పేలుడు సంభవించి ఉంటుందని...రెవెన్యూ, అధికారులు భావిస్తున్నారు. క్లూస్‌ టీం అధారాలు సేకరిస్తోంది.

ఇవీ చూడండి-మచిలీపట్నంలో దారుణం...పొదల్లో అప్పుడే పుట్టిన శిశువు

చిలకలూరిపేటలో పేలుడు... టపాసుల తయారీనే కారణమా !

గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో గ్యాస్‌ సిలిండర్ పేలి ఇద్దరు మహిళలు మృతిచెందగా... మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక ఎన్టీఆర్ కాలనీలో నివాసం ఉండే నాగార్జున ఇంట్లో పేలుడు సంభవించింది. పేలుడు తీవ్రతకు రేకుల ఇళ్లు పూర్తిగా ధ్వంసమైంది. చనిపోయిన వారి శరీర భాగాలు పక్కనే ఉన్న పార్కులో చెల్లాచెదురుగా పడిపోయాయి.

ఇద్దరు మృతి... మరొకరి పరిస్థితి విషమం....
భారీ శబ్దంతో పేలుడు సంభవించడం వల్ల చుట్టుపక్కల వారు బాంబు పేలుడుగా భావించినట్లు తెలిపారు. ఈ ఘటనలో నాగార్జున కుటుంబానికి సన్నిహితురాలైన దివ్య అక్కడికక్కడే చనిపోయింది. భార్య ఆదిలక్ష్మి ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన నాగార్జున, కుమార్తె శృతి, నాయనమ్మ గురుస్వామిని చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నాగార్జున పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు.

టపాసులు తయారీనే కారణమా...!
గ్యాస్ సిలిండర్ పేలిన కారణంగానే ప్రమాదం జరిగిందని నాగార్జున కుటుంబ సభ్యులు చెబుతుండగా... సంఘటనాస్థలంలో టపాసులు దొరకడం పలు అనుమానాలకు తావిస్తోంది. బాణాసంచా తయారీ చేస్తుండగా పేలుడు సంభవించి ఉంటుందని...రెవెన్యూ, అధికారులు భావిస్తున్నారు. క్లూస్‌ టీం అధారాలు సేకరిస్తోంది.

ఇవీ చూడండి-మచిలీపట్నంలో దారుణం...పొదల్లో అప్పుడే పుట్టిన శిశువు

Intro:యాంకర్
దివంగత లోక్ సభ అ మాజీ స్పీకర్ జి.ఎం.సి.బాలయోగి కారణజన్ముడని తేదేపా యువ నాయకుడు నారా లోకేష్ అన్నారు బాలయోగి జయంతి పురస్కరించుకుని తూర్పుగోదావరి జిల్లా అమలాపురం లోని ఆయన ఘాట్ వద్ద లోకేష్ బాలయోగి నివాళులర్పించారు అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఇ జగన్ ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా పరిపాలన సాగిస్తున్నారని అన్నారు పలువురు లోకేషన్ సత్కరించారు మాజీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప బాలయోగి తనయుడు యువ నాయకుడు హరీష్ మాధుర్ తదితరులు పాల్గొన్నారు
రిపోర్టర్ ఏ భగత్ సింగ్8008574229


Body:నారా లోకేష్


Conclusion:బాలయోగి జయంతి నారా లోకేష్ హాజరు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.