ETV Bharat / state

పాడైన పంటలను పరిశీలించిన మాజీ మంత్రి కొల్లు రవీంద్ర

author img

By

Published : Nov 29, 2020, 8:44 PM IST

నివర్ తుపాన్ కారణంగా నష్టపోయిన ప్రతి రైతుకు రూ.25,000 నష్టపరిహారం అందించాలని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు గుంటూరు జిల్లాలోని గోళ్లమూడి, ఉప్పలపాడు గ్రామాల్లో వరి పంటను ఆయన పరిశీలించారు.

పాడైన వరిపంటను పరిశీలిస్తున్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర
పాడైన వరిపంటను పరిశీలిస్తున్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర

గుంటూరు జిల్లా పెదకాకాని మండలంలోని నంబూరు, గోళ్ళమూడి, ఉప్పలపాడు గ్రామాల్లో పడి పోయిన వరి పంటను తెదేపా నేత కొల్లు రవీంద్ర పరిశీలించారు. తుపాన్ కారణంగా నష్టపోయిన ప్రతి రైతుకు రూ.25,000 నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని.. ఆయన కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తడిసిన ధాన్యాన్ని కేంద్రప్రభుత్వం ప్రకటించిన మద్ధతు ధరకే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, గుంటూరు జిల్లా తెదేపా పార్లమెంట్ ఆధ్యక్షుడు తెనాలి శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

గుంటూరు జిల్లా పెదకాకాని మండలంలోని నంబూరు, గోళ్ళమూడి, ఉప్పలపాడు గ్రామాల్లో పడి పోయిన వరి పంటను తెదేపా నేత కొల్లు రవీంద్ర పరిశీలించారు. తుపాన్ కారణంగా నష్టపోయిన ప్రతి రైతుకు రూ.25,000 నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని.. ఆయన కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తడిసిన ధాన్యాన్ని కేంద్రప్రభుత్వం ప్రకటించిన మద్ధతు ధరకే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, గుంటూరు జిల్లా తెదేపా పార్లమెంట్ ఆధ్యక్షుడు తెనాలి శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి

సభాక్షేత్రంలోకి అస్త్రశస్త్రాలతో తెలుగుదేశం పార్టీ..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.