ETV Bharat / state

​మసీద్​కు ఆలపాటి రాజేంద్ర లక్ష రూపాయల విరాళం - Former Minister allapati Rajendra Prasad news

మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ మర్ఖజ్​ మసీద్​కు లక్ష రూపాయలు విరాళం అందించారు. గుంటూరు జిల్లా తెనాలిలోని ఇస్లాంపేటలో ఉన్న మసీద్​కు రంజాన్​ సందర్భంగా విరాళం అందించటం ఆనవాయితీగా వస్తోందని చెప్పారు.

donation to masjid
విరాళం అందిస్తున్న మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్
author img

By

Published : May 14, 2021, 8:27 PM IST

గుంటూరు జిల్లా తెనాలి ఇస్లాంపేటలో ఉన్న మర్ఖజ్​ మసీద్​కు మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ లక్ష రూపాయలు విరాళం అందించారు. పట్టణ తెదేపా మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ ఖుద్దుస్ ద్వారా ముస్లిం మత పెద్దకు ఈ మొత్తాన్ని అందజేశారు. 2009 నుంచి ఏటా రంజాన్​ పర్వదినాన విరాళం ఇవ్వటం ఆనవాయితీగా వస్తోందని చెప్పారు. ముస్లిం కుటుంబాలకు రంజాన్​ శుభాకాంక్షలు తెలిపారు. అల్లా దయవల్ల.. కరోనా మహమ్మారి అంతం కావాలని వేడుకుంటున్నట్లు ఆలపాటి వివరించారు.

గుంటూరు జిల్లా తెనాలి ఇస్లాంపేటలో ఉన్న మర్ఖజ్​ మసీద్​కు మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ లక్ష రూపాయలు విరాళం అందించారు. పట్టణ తెదేపా మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ ఖుద్దుస్ ద్వారా ముస్లిం మత పెద్దకు ఈ మొత్తాన్ని అందజేశారు. 2009 నుంచి ఏటా రంజాన్​ పర్వదినాన విరాళం ఇవ్వటం ఆనవాయితీగా వస్తోందని చెప్పారు. ముస్లిం కుటుంబాలకు రంజాన్​ శుభాకాంక్షలు తెలిపారు. అల్లా దయవల్ల.. కరోనా మహమ్మారి అంతం కావాలని వేడుకుంటున్నట్లు ఆలపాటి వివరించారు.

ఇదీ చదవండి: కరోనా ఆంక్షలు నడుమ.. గుంటూరులో రంజాన్ వేడుకలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.