ETV Bharat / state

రాళ్లు, సీసాలతో దాడులు చేసుకున్న వైకాపా, తెదేపా వర్గాలు

author img

By

Published : Apr 9, 2021, 1:52 AM IST

గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం కారుచోల గ్రామంలో పరిషత్ ఎన్నికల నేపథ్యంలో వైకాపా, తెదేపా వర్గాల మధ్య గురువారం రాత్రి ఘర్షణ చోటు చేసుకుంది. ఘర్షణలో ఒకరిపై ఒకరు రాళ్లు, సీసాలతో దాడులు చేసుకోవడంతో 10 మంది గాయపడ్డారు. గాయపడిన క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

fight between tdp and ysrcp
వైకాపా, తెదేపా వర్గాల మధ్య ఘర్షణ

య‌డ్ల‌పాడు మండ‌లంలోని కారుచోల గ్రామంలో వైకాపా, తెదేపా వర్గాల మ‌ధ్య గురువారం రాత్రి ఘ‌ర్ష‌ణ జరిగింగి. ఈ గొడవలో పది మంది గాయపడ్డారు. ఘ‌ర్ష‌ణ‌లో ఇరువ‌ర్గాల వారు ఒక‌రిపై ఒక‌రు రాళ్లు, సీసాల‌తో దాడులు నిర్వ‌హించుకున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ ‌బూత్‌లో ఓటు వేసే విష‌య‌మై వాదోపవాదాలతో పాటు.. సామాజిక మాధ్యమాలలో పోస్టింగ్ పెట్టిన విషయంపై వివాదం జ‌రిగినట్లు పోలీసులు తెలిపారు.

విషయం తెలుసుకున్న చిల‌క‌లూరిపేట గ్రామీణ సీఐ ఎం.సుబ్బారావు, యడ్లపాడు ఎస్సై రాంబాబులు తమ సిబ్బందితో సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని ఇరువ‌ర్గాల వారిని చెద‌రగొట్టారు. చికిత్స కోసం క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అనంతరం గ్రామంలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఇరు వర్గాలపై కేసులు నమోదు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.

య‌డ్ల‌పాడు మండ‌లంలోని కారుచోల గ్రామంలో వైకాపా, తెదేపా వర్గాల మ‌ధ్య గురువారం రాత్రి ఘ‌ర్ష‌ణ జరిగింగి. ఈ గొడవలో పది మంది గాయపడ్డారు. ఘ‌ర్ష‌ణ‌లో ఇరువ‌ర్గాల వారు ఒక‌రిపై ఒక‌రు రాళ్లు, సీసాల‌తో దాడులు నిర్వ‌హించుకున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ ‌బూత్‌లో ఓటు వేసే విష‌య‌మై వాదోపవాదాలతో పాటు.. సామాజిక మాధ్యమాలలో పోస్టింగ్ పెట్టిన విషయంపై వివాదం జ‌రిగినట్లు పోలీసులు తెలిపారు.

విషయం తెలుసుకున్న చిల‌క‌లూరిపేట గ్రామీణ సీఐ ఎం.సుబ్బారావు, యడ్లపాడు ఎస్సై రాంబాబులు తమ సిబ్బందితో సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని ఇరువ‌ర్గాల వారిని చెద‌రగొట్టారు. చికిత్స కోసం క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అనంతరం గ్రామంలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఇరు వర్గాలపై కేసులు నమోదు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:

గొడవ వద్దని నచ్చజెప్పేందుకు ప్రయత్నించినందుకు...!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.