తమ పంట భూమిలో అనుమతి లేకుండా రెవెన్యూ అధికారులు మట్టి తోలరని గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం డోకిపర్రు గ్రామానికి చెందిన రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. రామకోటయ్య అనే వ్యక్తికి గతంలో గ్రామంలోని భూమికి ప్రభుత్వం డీకే పట్టా మంజూరు చేసింది. అప్పటి నుంచి రామకోటయ్య కుటుంబం అదే భూమిని సాగు చేసుకుంటూ జీవిస్తున్నారు. వైకాపా ప్రభుత్వం పేదలకు నివాస స్థలాలు ఇచ్చేందుకు రామకోటయ్యకు మంజూరు చేసిన భూమిలోకి రెవెన్యూ అధికారులు మట్టిని తోలారు. తనకు న్యాయం చేయాలని బాధితులు గుంటూరు స్పందనలో ఫిర్యాదు చేశారు. అక్కడ వారికి న్యాయం జరగనందునా కోర్టును ఆశ్రయించారు. పేదలకు ఇచ్చిన భూమిని మరలా పేదలకు ఇవ్వటం ఏంటని బాధితులు ప్రశ్నించారు.
ఇవీ చూడండి...