ETV Bharat / state

తోపుడు బండ్ల రుసుము నేనే వసూలు చేస్తా..! వివాదాస్పదమవుతున్న వైసీపీ కార్పొరేటర్ తీరు

GUNTUR CORPORATOR : నగర పాలక సంస్థల్లో ఉద్యోగులు పన్నులు వసూలు చేయడం సహజం. కానీ ఇక్కడ ఓ అధికార పార్టీ కార్పొరేటర్ మాత్రం వ్యాపారుల నుంచి రుసుము వసూలు చేస్తానని చెప్పి వారిని బెదిరిస్తున్నాడు. ​ కొందరు వసూళ్లకు వెళ్తే.. బెదిరింపులకు దిగారు. ఈ ఘటన గుంటూరులో జరిగింది.

author img

By

Published : Apr 8, 2023, 10:39 AM IST

GUNTUR CORPORATOR
GUNTUR CORPORATOR

GUNTUR CORPORATOR :గుంటూరు నగరంలో అధికార పార్టీ కార్పొరేటర్ తీరు తీవ్ర చర్చకు దారితీసింది. తోపుడు బండ్ల వ్యాపారుల నుంచి తానే రుసుము వసూలు చేసి కార్పొరేషన్ కు జమ చేస్తానని చెప్పటంతో పాటు వసూళ్లకు వెళ్లిన ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేయటం కలకలం రేపింది. ఈ వ్యవహారంపై తోపుడు బండ్ల వ్యాపారులు మండిపడుతున్నారు. కోట్ల రూపాయలు జేబులో వేసుకునేందుకే కార్పొరేటర్ ముందుకు వచ్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో వందల మంది చిరు వ్యాపారులు తోపుడు బండ్లపై పండ్లు, పూలు, కూరగాయలు పెట్టుకుని విక్రయిస్తుంటారు. వారి నుంచి రోజువారీ పన్ను వసూలుకు కాంట్రాక్టు ఇస్తుంటారు. మార్చి నెలతో కాంట్రాక్టు ముగియగా... కొత్తగా ఎవరికీ ఇవ్వలేదు. టెండర్లు పిలిచి గుత్తేదారుకు బాధ్యతలు అప్పగించే వరకు ఈ వసూళ్లు రెవెన్యూ విభాగానికి చెందిన ఆర్‌ఐ, బిల్‌ కలెక్టర్లు చూడాలని కమిషనర్‌ ఆదేశించారు. దీనికి అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్‌ ఒకరు అడ్డు తగులుతూ ఉద్యోగులను బెదిరింపులకు గురిచేస్తున్నారు. వసూళ్లకు వెళ్లవద్దని, తానే వసూలు చేసి జమ చేస్తానని ఉద్యోగులకు హుకుం జారీ చేశారు. కొందరు వసూళ్లకు వెళ్తే.. బెదిరింపులకు దిగారు. కార్పొరేటర్‌ అనే గౌరవం లేకుండా వెళ్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేయటం నగరపాలక సంస్థ ఉద్యోగుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది.

పీవీకే నాయుడు మార్కెట్‌తో పాటు దాని పరిసరాల్లోనే సుమారు 500 మందికి పైగా వ్యాపారులు ఉంటారు. ఇక్కడ కోట్లలో ఆదాయం వచ్చే అవకాశం ఉండడంతో టెండర్లు పిలిచే వరకైనా వసూలు చేసుకుందామనే ఆలోచనలో కార్పొరేటర్‌ ఉన్నారు. కొందరు వ్యాపారుల నుంచి వసూళ్లు చేశారు. విషయం తెలిసిన వీధివ్యాపారుల సంఘం కమిషనర్ ను కలిసి ఫిర్యాదు చేసింది. వీధి వ్యాపారుల ఫిర్యాదుతో ప్రస్తుతం వసూళ్లు ఆపివేయాలని కమిషనర్ అధికారుల్ని ఆదేశించారు. వసూలు చేసిన మొత్తాన్ని వెనక్కివ్వాలని వ్యాపారులు కోరుతున్నారు.

గతంలో మేయర్‌కు సన్నిహితంగా మెలిగే అధికార పార్టీ నాయకుడొకరు ఈ కాంట్రాక్టును దక్కించుకున్నారు. సంపాదన బాగా ఉండటంతో అధికార పార్టీ నేతలు ఈసారి టెండర్‌పై కన్నేశారు. ఈసారి కూడా దస్త్రం పంపినా.. ఇంకా ఆమోదించలేదు. యంత్రాంగాన్నే వసూళ్లు చేయాలని ఆదేశించడం చూస్తే టెండర్లు పిలవటం అనుమానంగా కనిపిస్తోంది. కార్పొరేటర్ వసూళ్ల వ్యవహారం తన దృష్టికి రాలేదని మేయర్ కావటి మనోహర్ నాయుడు అన్నారు.

వ్యాపారులు వారి ఉత్పత్తులను విక్రయించుకోవడానికి వీలుగా రెడ్‌, ఆరెంజ్‌, బఫర్‌ జోన్లు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలున్నాయి. దీంతో ఈసారి టెండర్లు పిలవకూడదనే యోచనలో నగరపాలక ఉన్నతాధికారులు ఉన్నారు. జోన్ల వారీగా వ్యాపారులను విభజించి... వారికి నిర్దేశించిన చోట వ్యాపారం చేసుకుంటే రహదారుల వెంట తోపుడు బండ్లు ఉండవు. దీంతో ట్రాఫిక్‌ సమస్యలకు అడ్డుకట్ట పడుతుంది. అధికారులు త్వరగా కొత్త విధానాన్ని అమలు చేస్తే ఎలాంటి ఇబ్బందులుండవని వ్యాపారులు చెబుతున్నారు.

తోపుడు బండ్ల రుసుము నేనే వసూలు చేస్తా..!

ఇవీ చదవండి:

GUNTUR CORPORATOR :గుంటూరు నగరంలో అధికార పార్టీ కార్పొరేటర్ తీరు తీవ్ర చర్చకు దారితీసింది. తోపుడు బండ్ల వ్యాపారుల నుంచి తానే రుసుము వసూలు చేసి కార్పొరేషన్ కు జమ చేస్తానని చెప్పటంతో పాటు వసూళ్లకు వెళ్లిన ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేయటం కలకలం రేపింది. ఈ వ్యవహారంపై తోపుడు బండ్ల వ్యాపారులు మండిపడుతున్నారు. కోట్ల రూపాయలు జేబులో వేసుకునేందుకే కార్పొరేటర్ ముందుకు వచ్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో వందల మంది చిరు వ్యాపారులు తోపుడు బండ్లపై పండ్లు, పూలు, కూరగాయలు పెట్టుకుని విక్రయిస్తుంటారు. వారి నుంచి రోజువారీ పన్ను వసూలుకు కాంట్రాక్టు ఇస్తుంటారు. మార్చి నెలతో కాంట్రాక్టు ముగియగా... కొత్తగా ఎవరికీ ఇవ్వలేదు. టెండర్లు పిలిచి గుత్తేదారుకు బాధ్యతలు అప్పగించే వరకు ఈ వసూళ్లు రెవెన్యూ విభాగానికి చెందిన ఆర్‌ఐ, బిల్‌ కలెక్టర్లు చూడాలని కమిషనర్‌ ఆదేశించారు. దీనికి అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్‌ ఒకరు అడ్డు తగులుతూ ఉద్యోగులను బెదిరింపులకు గురిచేస్తున్నారు. వసూళ్లకు వెళ్లవద్దని, తానే వసూలు చేసి జమ చేస్తానని ఉద్యోగులకు హుకుం జారీ చేశారు. కొందరు వసూళ్లకు వెళ్తే.. బెదిరింపులకు దిగారు. కార్పొరేటర్‌ అనే గౌరవం లేకుండా వెళ్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేయటం నగరపాలక సంస్థ ఉద్యోగుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది.

పీవీకే నాయుడు మార్కెట్‌తో పాటు దాని పరిసరాల్లోనే సుమారు 500 మందికి పైగా వ్యాపారులు ఉంటారు. ఇక్కడ కోట్లలో ఆదాయం వచ్చే అవకాశం ఉండడంతో టెండర్లు పిలిచే వరకైనా వసూలు చేసుకుందామనే ఆలోచనలో కార్పొరేటర్‌ ఉన్నారు. కొందరు వ్యాపారుల నుంచి వసూళ్లు చేశారు. విషయం తెలిసిన వీధివ్యాపారుల సంఘం కమిషనర్ ను కలిసి ఫిర్యాదు చేసింది. వీధి వ్యాపారుల ఫిర్యాదుతో ప్రస్తుతం వసూళ్లు ఆపివేయాలని కమిషనర్ అధికారుల్ని ఆదేశించారు. వసూలు చేసిన మొత్తాన్ని వెనక్కివ్వాలని వ్యాపారులు కోరుతున్నారు.

గతంలో మేయర్‌కు సన్నిహితంగా మెలిగే అధికార పార్టీ నాయకుడొకరు ఈ కాంట్రాక్టును దక్కించుకున్నారు. సంపాదన బాగా ఉండటంతో అధికార పార్టీ నేతలు ఈసారి టెండర్‌పై కన్నేశారు. ఈసారి కూడా దస్త్రం పంపినా.. ఇంకా ఆమోదించలేదు. యంత్రాంగాన్నే వసూళ్లు చేయాలని ఆదేశించడం చూస్తే టెండర్లు పిలవటం అనుమానంగా కనిపిస్తోంది. కార్పొరేటర్ వసూళ్ల వ్యవహారం తన దృష్టికి రాలేదని మేయర్ కావటి మనోహర్ నాయుడు అన్నారు.

వ్యాపారులు వారి ఉత్పత్తులను విక్రయించుకోవడానికి వీలుగా రెడ్‌, ఆరెంజ్‌, బఫర్‌ జోన్లు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలున్నాయి. దీంతో ఈసారి టెండర్లు పిలవకూడదనే యోచనలో నగరపాలక ఉన్నతాధికారులు ఉన్నారు. జోన్ల వారీగా వ్యాపారులను విభజించి... వారికి నిర్దేశించిన చోట వ్యాపారం చేసుకుంటే రహదారుల వెంట తోపుడు బండ్లు ఉండవు. దీంతో ట్రాఫిక్‌ సమస్యలకు అడ్డుకట్ట పడుతుంది. అధికారులు త్వరగా కొత్త విధానాన్ని అమలు చేస్తే ఎలాంటి ఇబ్బందులుండవని వ్యాపారులు చెబుతున్నారు.

తోపుడు బండ్ల రుసుము నేనే వసూలు చేస్తా..!

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.