ETV Bharat / state

కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయ్!

author img

By

Published : Apr 3, 2020, 12:51 PM IST

కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గుంటూరు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాలో ఇప్పటి వరకూ 314 మంది అనుమానితుల నుంచి నమూనాలు సేకరించారు. వారిలో 20 మందికి పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది. మిగిలిన వారిలో 200 మందికి నెగిటివ్​ రాగా.... 94 మంది నివేదికలు రావాల్సి ఉంది.

అప్రమత్తమైన గుంటూరు జిల్లా యంత్రాంగం
అప్రమత్తమైన గుంటూరు జిల్లా యంత్రాంగం
అప్రమత్తమైన గుంటూరు జిల్లా యంత్రాంగం

కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నందున గుంటూరు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాలో ఇప్పటి వరకూ 314 మంది అనుమానితుల నుంచి నమూనాలు సేకరించగా... అందులో 20 పాజిటివ్​గా నిర్ధరణ అయ్యాయి. 200 మందికి నెగిటివ్ వచ్చింది. మిగిలిన 94 మంది నివేదికలు రావాల్సి ఉంది. కరోనా రోగ నిర్ధరణ పరీక్షల కోసం గుంటూరులో ఏర్పాటు చేసిన ప్రయోగశాల రేపటి నుంచి అందుబాటులోకి రానుంది. వైద్యకళాశాల ప్రాంగణంలోని ల్యాబ్​లోనే ఈ ప్రయోగశాల ఏర్పాటు చేశారు. రోజుకు 60 నమూనాలు పరిక్షించేలా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు.

కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో 17 మంది మంగళగిరిలోని ఎన్​ఆర్​ఐ ఆసుపత్రిలో, ఇద్దరు విజయవాడ కొవిడ్-19 ప్రత్యేక వార్డులో, మరొకరు గుంటూరు ఐడీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అనుమానితులతో పాటు పాజిటివ్ వచ్చిన వారి కుటుంబసభ్యులను కాటూరి ఆసుపత్రి క్వారంటైన్​ సెంటర్​లో ఉంచారు. మరికొందరు ఐడీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ ఆసుపత్రిలో 10 పడకలు పాజిటివ్ కేసుల కోసం కేటాయించారు. ఎవరికైనా పాజిటివ్ ఉన్నట్లు తేలితే వెంటనే వారిని సంబంధిత వార్డులోకి మారుస్తున్నారు.

కాటూరి ఆసుపత్రి ఐసోలేషన్​లో ఉండి పాజిటివ్ వచ్చిన వారిని ఎన్​ఆర్​ఐ ఆసుపత్రికి తరలిస్తున్నారు. జిల్లాలో 28 క్వారంటైన్ కేంద్రాలను ఇప్పటి వరకూ సిద్ధం చేయగా వాటిలో 312 మంది చికిత్స పొందుతున్నారు. పాజిటివ్ కేసులు వచ్చిన గుంటూరు, మాచర్ల, అచ్చంపేట, క్రోసూరు, మేడికొండూరు, మంగళగిరి ప్రాంతాలను రెడ్​జోన్లుగా ప్రకటించారు. పాజిటివ్ రోగులు నివశించిన ప్రాంతాల వైపు ప్రజలను వెళ్లనీయకుండా చర్యలు చేపట్టారు.

ఇదీ చూడండి:

కరోనా ఎఫెక్ట్‌: మంగళగిరిలో రెడ్‌జోన్‌

అప్రమత్తమైన గుంటూరు జిల్లా యంత్రాంగం

కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నందున గుంటూరు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాలో ఇప్పటి వరకూ 314 మంది అనుమానితుల నుంచి నమూనాలు సేకరించగా... అందులో 20 పాజిటివ్​గా నిర్ధరణ అయ్యాయి. 200 మందికి నెగిటివ్ వచ్చింది. మిగిలిన 94 మంది నివేదికలు రావాల్సి ఉంది. కరోనా రోగ నిర్ధరణ పరీక్షల కోసం గుంటూరులో ఏర్పాటు చేసిన ప్రయోగశాల రేపటి నుంచి అందుబాటులోకి రానుంది. వైద్యకళాశాల ప్రాంగణంలోని ల్యాబ్​లోనే ఈ ప్రయోగశాల ఏర్పాటు చేశారు. రోజుకు 60 నమూనాలు పరిక్షించేలా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు.

కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో 17 మంది మంగళగిరిలోని ఎన్​ఆర్​ఐ ఆసుపత్రిలో, ఇద్దరు విజయవాడ కొవిడ్-19 ప్రత్యేక వార్డులో, మరొకరు గుంటూరు ఐడీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అనుమానితులతో పాటు పాజిటివ్ వచ్చిన వారి కుటుంబసభ్యులను కాటూరి ఆసుపత్రి క్వారంటైన్​ సెంటర్​లో ఉంచారు. మరికొందరు ఐడీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ ఆసుపత్రిలో 10 పడకలు పాజిటివ్ కేసుల కోసం కేటాయించారు. ఎవరికైనా పాజిటివ్ ఉన్నట్లు తేలితే వెంటనే వారిని సంబంధిత వార్డులోకి మారుస్తున్నారు.

కాటూరి ఆసుపత్రి ఐసోలేషన్​లో ఉండి పాజిటివ్ వచ్చిన వారిని ఎన్​ఆర్​ఐ ఆసుపత్రికి తరలిస్తున్నారు. జిల్లాలో 28 క్వారంటైన్ కేంద్రాలను ఇప్పటి వరకూ సిద్ధం చేయగా వాటిలో 312 మంది చికిత్స పొందుతున్నారు. పాజిటివ్ కేసులు వచ్చిన గుంటూరు, మాచర్ల, అచ్చంపేట, క్రోసూరు, మేడికొండూరు, మంగళగిరి ప్రాంతాలను రెడ్​జోన్లుగా ప్రకటించారు. పాజిటివ్ రోగులు నివశించిన ప్రాంతాల వైపు ప్రజలను వెళ్లనీయకుండా చర్యలు చేపట్టారు.

ఇదీ చూడండి:

కరోనా ఎఫెక్ట్‌: మంగళగిరిలో రెడ్‌జోన్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.