ETV Bharat / state

నరసరావుపేటలో పెరుగుతున్న కరోనా కేసులు - నరసరావుపేటలో నానాటికి పెరుగుతున్న కరోనా కేసులు

గుంటూరు జిల్లా నరసరావుపేటలో కరోనా కేసులు నానాటికి పెరుగుతున్నాయి. జిల్లాలో నేడు 9 కేసులు నమోదు కాగా... నరసరావుపేటలో మరో కేసు నమోదైంది. పట్టణంలో కేసుల సంఖ్య 174 కు పెరిగింది.

author img

By

Published : May 16, 2020, 6:24 PM IST

గుంటూరు జిల్లా నరసరావుపేటలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఆరోగ్య శాఖ విడుదల చేసిన కరోనా పాజిటివ్ నివేదికలో... నేడు 9 కేసులు నమోదు కాగా.. అందులో ఒకటి నరసరావుపేటలో నమోదైంది. దీంతో ఇప్పటివరకూ పట్టణంలో 174 కరోనా కేసులు నమోదయ్యాయి.

అధికారులు మిషన్ మే 15 స్లోగన్​తో... మే15 నాటికి కరోనా కేసులు జీరోస్థాయికి తీసుకురావాలని ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ పట్టణంలో కేసులు మాత్రం ఆగటం లేదు. సుమారు రెండు రోజులకు ఒక కేసు అయిన నమోదవుతూనే ఉంది. అదీ కొత్త ప్రాంతాలలో నమోదవడం అధికారులను కొంతమేర కలవరపెడుతోంది.

ఈ పరిణామాలు మారాలంటే ప్రజల సహకారం ఎంతో ముఖ్యమని అధికారులు చెబుతున్నారు. ప్రజలు అనవసరంగా బయటకు రావడం, మాస్క్ లు ధరించక పోవడం లాంటివి చేయకుండా అధికారులు సూచించిన ఆదేశాలను పాటించాలన్నారు.

గుంటూరు జిల్లా నరసరావుపేటలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఆరోగ్య శాఖ విడుదల చేసిన కరోనా పాజిటివ్ నివేదికలో... నేడు 9 కేసులు నమోదు కాగా.. అందులో ఒకటి నరసరావుపేటలో నమోదైంది. దీంతో ఇప్పటివరకూ పట్టణంలో 174 కరోనా కేసులు నమోదయ్యాయి.

అధికారులు మిషన్ మే 15 స్లోగన్​తో... మే15 నాటికి కరోనా కేసులు జీరోస్థాయికి తీసుకురావాలని ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ పట్టణంలో కేసులు మాత్రం ఆగటం లేదు. సుమారు రెండు రోజులకు ఒక కేసు అయిన నమోదవుతూనే ఉంది. అదీ కొత్త ప్రాంతాలలో నమోదవడం అధికారులను కొంతమేర కలవరపెడుతోంది.

ఈ పరిణామాలు మారాలంటే ప్రజల సహకారం ఎంతో ముఖ్యమని అధికారులు చెబుతున్నారు. ప్రజలు అనవసరంగా బయటకు రావడం, మాస్క్ లు ధరించక పోవడం లాంటివి చేయకుండా అధికారులు సూచించిన ఆదేశాలను పాటించాలన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.