గుంటూరు జిల్లా పిడుగురాళ్ల జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలకు ఇస్త్రో విశ్రాంత శాస్త్రవేత్త శ్రీ యాళ్ల శివ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అబ్దుల్ కలాం సాధించిన విజయాల గురించి ఆయన విద్యార్థులకు వివరించారు. కలాం రచించిన వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే పుస్తకాన్ని పరిచయం చేశారు. అనంతరం ఇస్రోలో నిర్వహించే ప్రయోగాల గురించి తెలిపారు. విద్యార్థులకు బహుమతులను అందించారు.
ఇదీ చూడండి: తగరపువలస అవంతి కళాశాలలో.. ఇస్రో ఎగ్జిబిషన్