ఏపీఈసెట్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. సెప్టెంబరు 14న నిర్వహించిన ఈ పరీక్షకు 31,891 మంది హాజరుకాగా.. 30654 మంది ఉత్తీర్ణత సాధించారు. ర్యాంకు కార్డులను ఈ నెల8 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని మంత్రి తెలిపారు. పురుషులలో 25,160 మంది, మహిళలు 6,731 మంది ఉత్తీర్ణులయ్యారు. ఎంసెట్ ఫలితాలను ఈ నెల 9న విడుదల చేయబోతున్నామని మంత్రి వెల్లడించారు. ఈ సారి నిర్వహించిన పరీక్షలు ప్రత్యేకమైనవన్నారు. కేవలం రెండు వారాల్లోనే ఫలితాలు విడుదల చేశామన్నారు.
గ్రూపుల వారీగా మొదటి ర్యాంకు సాధించిన వారి వివరాలు..
- అగ్రికల్చరల్ ఇంజనీరింగ్లో అనంతపురానికి చెందిన గొర్తి వంశీకృష్ణ
- బీఎస్సీ మేథమెటిక్స్ లో శ్రీకాకుళంకు చెందిన శివాల శ్రీనివాసరావు
- సిరామిక్ టెక్నాలజీలో ప్రకాశం జిల్లాకు చెందిన తూతిక సంతోష్ కుమార్
- కెమికల్ ఇంజనీరింగ్లో గుంటూరుకు చెందిన ముస్తాక్ అహ్మద్
- సివిల్ ఇంజనీరింగ్లో తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన బానోతు అంజలి
- కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో కాకినాడకు చెందిన కోడి తేజ
- ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో కడపకు చెందిన నరేష్ రెడ్డి
- ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లో గుంటూరు జిల్లా రేపల్లెకు చెందిన కుర్రా వైష్ణవి
- ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్లో తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాకు చెందిన పృథ్వీ
- మెకానికల్ ఇంజనీరింగ్లో విశాఖ జిల్లా విద్యార్థి గరగా అజయ్
- మెటలార్జికల్ ఇంజనీరింగ్లో విజయనగరం జిల్లా విద్యార్థి వరుణ్ రాజు
- మైనింగ్ ఇంజనీరింగ్ లో తెలంగాణలోని ములుగ చెందిన బానాల వంశీకృష్ణ
- ఫార్మసీలో కృష్ణా జిల్లా విద్యార్థి అశ్లేష్ కుమార్, శ్రీకాకుళం జిల్లా విద్యార్థిని శాంతి
ఇదీ చదవండి: ప్రధాని మోదీతో ముగిసిన సీఎం జగన్ భేటీ.. ఆర్థిక, తాజా అంశాలపై చర్చ