ETV Bharat / state

ఐకానిక్ కు అదిరే స్పందన

నవ్యాంధ్రను సిలికానాంధ్రగా చేయాలని ఆకాంక్షిస్తోన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగానే ప్రవాసాంధ్రులు స్పందిస్తున్నారు. అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఏపీ ఎన్నాఆర్టీ ఆధ్వర్యంలో రాజధాని అమరావతి పరిధిలో ఐకాన్ టవర్ నిర్మాణానికి భాగస్వాములయ్యేందుకు పోటాపోటీగా ముందుకొచ్చారు.

author img

By

Published : Feb 22, 2019, 10:13 AM IST

Updated : Feb 22, 2019, 10:49 AM IST

ఎన్​ఆర్​టీ

ఏపీ ఎన్నార్టీ ఆధ్వర్యంలో రాజధాని అమరావతి పరిధిలో ఐకాన్ టవర్ నిర్మాణానికి భాగస్వాములయ్యేందుకు పోటాపోటీగా ముందుకొచ్చారు. ఫ్లాట్ల కొనుగోలుకు ఆన్​లైన్ లో నిర్వహించిన బుకింగ్​కు గంట వ్యవధిలోనే 142 ఫ్లాట్లు అమ్ముడవటం అమరావతి బ్రాండ్​కు లభిస్తోన్న ఆదరణగా అధికారులు తెలుపుతున్నారు.
కృష్ణా నదికి దగ్గర్లో రాయపూడి రాజధాని ప్రాంతంలో 5 ఎకరాల్లో ఏపీ ఎన్ఆర్టీ నిర్మిస్తున్న 'ఎన్నార్టీ ఐకాన్' లో ఫ్లాట్ల కొనుగోలుకు అనూహ్య స్పందన లభించింది. సుమారు 500 కోట్లతో అత్యాధునిక హంగులతో 33 అంతస్థుల భవనం నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఇందులో 150 ఫ్లాట్లను నిర్మిస్తున్నారు. వీటిని వాణిజ్య కార్యాలయాలకు, నివాసం కోసం ఉపయోగించుకోవచ్చు. ఇందులో రివాల్వింగ్ హోటల్, స్విమ్మింగ్ పూల్ సదుపాయాలు ఉంటాయి.

ap, nrt, nri, buildings, amaravathi
ఎన్​ఆర్​టీ
ఈ ప్రాజెక్టులో ఒక్కో ఫ్లాట్ ను 5 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తారు. మొత్తం 150 ఫ్లాట్లలో 142 బుకింగ్ లో పెట్టారు. చదరపు అడుగు ధర 5500 రూపాయలుగా నిర్ణయించారు. ఇతర సౌకర్యాల కోసం అదనంగా సొమ్ము చెల్లించాలి. అన్ని ఖర్చులు కలుపుకుని సగటున చదరపుఅడుగుకు 7 వేల రూపాయల వరకు అవుతోంది. రాజధాని ప్రాంతంలో ఇదే అత్యధిక ధర. హ్యాపీనెస్ట్​లో బేసిక్ ధర, ఇతర సౌకర్యాలు కలుపుకుని నాలుగున్నర వేలుగా ధరను నిర్ణయించారు. ఎన్నార్టీలో ఐటీ కంపెనీలు పెట్టుకునే కమర్షియల్ స్థలం కూడా ఉంటుంది. కృష్ణా నదికి దగ్గర్లో.. సహజమైన గాలి, వెలుతురు ఉండేలా డిజైన్లు రూపొందించారు. అమరావతిని సూచించే విధంగా ఆంగ్ల అక్షరం 'ఎ' ఆకారంలో భవన నిర్మాణం చేపడతారు. ఈ అక్షరం మధ్యలో పెద్ద గ్లోబును కూడా ఏర్పాటు చేస్తారు. ఇందులో ఏర్పాటయ్యే ఐటీ కంపెనీల వల్ల ప్రత్యక్షంగా 5 వేల మందికి, పరోక్షంగా మరికొంత మందికి ఉపాధి లభిస్తుందని ఏపీఎన్నార్టీ అధ్యక్షులు రవికుమార్ వేమూరి తెలిపారు.
undefined
ap, nrt, nri, buildings, amaravathi
ఎన్​ఆర్​టీ
ఐకాన్ టవర్ ముందు 50 అడుగుల ఎత్తున్న 40 దేశాల పతాకాలతో నిర్మించిన పెవీలియన్ అందరినీ ఆకట్టుకుంటోంది. అమరావతి ప్రభుత్వ కార్యాలయాల నడుమ ఈ టవర్ ను ఎక్సో స్కెల్టెన్ విధానంలో నిర్మించబోతున్నారు. సంప్రదాయ విధానంలో అడ్డుగా వచ్చే కాంక్రీట్ పిల్లర్లు..కాలమ్స్ విధానంలో ఉండవు. ఇందులో 6 శాతం స్థలం పెరగటమే కాకుండా ఆకర్షణీయంగా ఉంటుంది. పర్యావరణానికి అనుకూలంగా నిర్మించటం వల్ల అన్ని అంతస్తుల్లో ఉద్యానవనాలు ఉంటాయని ప్రతినిధులు తెలిపారు.
undefined
ఎన్​ఆర్​టీ

ఏపీ ఎన్నార్టీ ఆధ్వర్యంలో రాజధాని అమరావతి పరిధిలో ఐకాన్ టవర్ నిర్మాణానికి భాగస్వాములయ్యేందుకు పోటాపోటీగా ముందుకొచ్చారు. ఫ్లాట్ల కొనుగోలుకు ఆన్​లైన్ లో నిర్వహించిన బుకింగ్​కు గంట వ్యవధిలోనే 142 ఫ్లాట్లు అమ్ముడవటం అమరావతి బ్రాండ్​కు లభిస్తోన్న ఆదరణగా అధికారులు తెలుపుతున్నారు.
కృష్ణా నదికి దగ్గర్లో రాయపూడి రాజధాని ప్రాంతంలో 5 ఎకరాల్లో ఏపీ ఎన్ఆర్టీ నిర్మిస్తున్న 'ఎన్నార్టీ ఐకాన్' లో ఫ్లాట్ల కొనుగోలుకు అనూహ్య స్పందన లభించింది. సుమారు 500 కోట్లతో అత్యాధునిక హంగులతో 33 అంతస్థుల భవనం నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఇందులో 150 ఫ్లాట్లను నిర్మిస్తున్నారు. వీటిని వాణిజ్య కార్యాలయాలకు, నివాసం కోసం ఉపయోగించుకోవచ్చు. ఇందులో రివాల్వింగ్ హోటల్, స్విమ్మింగ్ పూల్ సదుపాయాలు ఉంటాయి.

ap, nrt, nri, buildings, amaravathi
ఎన్​ఆర్​టీ
ఈ ప్రాజెక్టులో ఒక్కో ఫ్లాట్ ను 5 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తారు. మొత్తం 150 ఫ్లాట్లలో 142 బుకింగ్ లో పెట్టారు. చదరపు అడుగు ధర 5500 రూపాయలుగా నిర్ణయించారు. ఇతర సౌకర్యాల కోసం అదనంగా సొమ్ము చెల్లించాలి. అన్ని ఖర్చులు కలుపుకుని సగటున చదరపుఅడుగుకు 7 వేల రూపాయల వరకు అవుతోంది. రాజధాని ప్రాంతంలో ఇదే అత్యధిక ధర. హ్యాపీనెస్ట్​లో బేసిక్ ధర, ఇతర సౌకర్యాలు కలుపుకుని నాలుగున్నర వేలుగా ధరను నిర్ణయించారు. ఎన్నార్టీలో ఐటీ కంపెనీలు పెట్టుకునే కమర్షియల్ స్థలం కూడా ఉంటుంది. కృష్ణా నదికి దగ్గర్లో.. సహజమైన గాలి, వెలుతురు ఉండేలా డిజైన్లు రూపొందించారు. అమరావతిని సూచించే విధంగా ఆంగ్ల అక్షరం 'ఎ' ఆకారంలో భవన నిర్మాణం చేపడతారు. ఈ అక్షరం మధ్యలో పెద్ద గ్లోబును కూడా ఏర్పాటు చేస్తారు. ఇందులో ఏర్పాటయ్యే ఐటీ కంపెనీల వల్ల ప్రత్యక్షంగా 5 వేల మందికి, పరోక్షంగా మరికొంత మందికి ఉపాధి లభిస్తుందని ఏపీఎన్నార్టీ అధ్యక్షులు రవికుమార్ వేమూరి తెలిపారు.
undefined
ap, nrt, nri, buildings, amaravathi
ఎన్​ఆర్​టీ
ఐకాన్ టవర్ ముందు 50 అడుగుల ఎత్తున్న 40 దేశాల పతాకాలతో నిర్మించిన పెవీలియన్ అందరినీ ఆకట్టుకుంటోంది. అమరావతి ప్రభుత్వ కార్యాలయాల నడుమ ఈ టవర్ ను ఎక్సో స్కెల్టెన్ విధానంలో నిర్మించబోతున్నారు. సంప్రదాయ విధానంలో అడ్డుగా వచ్చే కాంక్రీట్ పిల్లర్లు..కాలమ్స్ విధానంలో ఉండవు. ఇందులో 6 శాతం స్థలం పెరగటమే కాకుండా ఆకర్షణీయంగా ఉంటుంది. పర్యావరణానికి అనుకూలంగా నిర్మించటం వల్ల అన్ని అంతస్తుల్లో ఉద్యానవనాలు ఉంటాయని ప్రతినిధులు తెలిపారు.
undefined
ఎన్​ఆర్​టీ
AP Video Delivery Log - 0300 GMT News
Friday, 22 February, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0203: US Israel Launch AP Clients Only 4197344
Israel aims for the moon with Genesis lunar lander
AP-APTN-0114: SKorea Modi AP Clients Only 4197343
Indian PM visits National Cemetery in Seoul
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Feb 22, 2019, 10:49 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.