ETV Bharat / state

రాజధాని అమరావతికి మద్దతు తెలిపేవాళ్లకే ఓటు వేయండి: రాజధాని రైతులు

author img

By

Published : Jan 31, 2021, 6:07 PM IST

పారిపాలన రాజధానిగా అమరావతికి మద్దతు తెలిపేవాళ్లకే ఓటు వేయాలని ప్రజలకు రాజధాని రైతులు విజ్ఞప్తి చేశారు. అమరావతికి మద్దతుగా 411వ రోజు రైతులు, మహిళలు నిరసన దీక్షలు చేపట్టారు.

armers 411th day protest
రాజధానిగా అమరావతికి మద్దతు తెలపేవాళ్లకే ఓటు వేయండి

ప్రజాస్వామ్యవాదులంతా అమరావతికి మద్దతు తెలిపేవాళ్లకే ఓటు వేయాలని రాజధాని రైతులు విజ్ఞప్తి చేశారు. ప్రజలంతా తమ ఓటు హక్కును సక్రమంగా వినియోగిస్తే అమరావతి నిలుస్తోందని ఐకాస నేతలు పేర్కొన్నారు. పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ.. 411వ రోజు రైతులు, మహిళలు ఆందళన చేపట్టారు. తుళ్లూరు, మందడం, అనంతవరం, వెంకటపాలెం, పెదపరిమి గ్రామాల్లో రైతులు నిరసన దీక్షలు కొనసాగించారు.

సంక్రాంతి సందర్భంగా అమరావతి ఉద్యమంపై మహిళలు, రైతులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో మొదటి మూడు స్థానంలో నిలిచిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. రైతుల వ్యాసరచనలను పుస్తక రూపంలో తీసుకొస్తామని పోటీల నిర్వాహకులు తెలిపారు. ఉద్యమాన్ని క్రమంగా అన్ని జిల్లాలకు విస్తరిస్తామని ఐకాస నేతలు చెప్పారు.

ప్రజాస్వామ్యవాదులంతా అమరావతికి మద్దతు తెలిపేవాళ్లకే ఓటు వేయాలని రాజధాని రైతులు విజ్ఞప్తి చేశారు. ప్రజలంతా తమ ఓటు హక్కును సక్రమంగా వినియోగిస్తే అమరావతి నిలుస్తోందని ఐకాస నేతలు పేర్కొన్నారు. పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ.. 411వ రోజు రైతులు, మహిళలు ఆందళన చేపట్టారు. తుళ్లూరు, మందడం, అనంతవరం, వెంకటపాలెం, పెదపరిమి గ్రామాల్లో రైతులు నిరసన దీక్షలు కొనసాగించారు.

సంక్రాంతి సందర్భంగా అమరావతి ఉద్యమంపై మహిళలు, రైతులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో మొదటి మూడు స్థానంలో నిలిచిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. రైతుల వ్యాసరచనలను పుస్తక రూపంలో తీసుకొస్తామని పోటీల నిర్వాహకులు తెలిపారు. ఉద్యమాన్ని క్రమంగా అన్ని జిల్లాలకు విస్తరిస్తామని ఐకాస నేతలు చెప్పారు.

ఇదీ చూడండి: పోలవరం ముంపు నిర్వాసితులకు న్యాయం చేయాలి: హైకోర్టులో పిల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.