ETV Bharat / state

రాజధానిని తరలించొద్దంటూ.. ఐకాస ర్యాలీలు

3 రాజధానుల ప్రతిపాదన ప్రభావంతో.. అమరావతి పరిధిలోని గ్రామాల్లో పండుగ వాతావరణం కనబడటం లేదు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని పలు గ్రామాల్లో ప్రజలు అమరావతి కోసం ఆందోళనల్లో పాల్గొంటున్నారు. వారి బంధువులను ఈ పోరాటంలో భాగం చేస్తున్నారు. మన రాజధాని అమరావతి, మూడు రాజధానులు వద్దు అమరావతి ముద్దు అని నినదిస్తున్నారు. జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ చేస్తున్నారు.

author img

By

Published : Jan 15, 2020, 5:53 PM IST

Amaravathi jac rallies in krishna, guntur
రాజధానిని తరలించొద్దని.. జేఏసీ ర్యాలీలు
పెనుగ్రంచిపోలులో జేఏసీ ర్యాలీ

మూడు రాజధానులు వద్దు అమరావతి ముద్దు అంటూ కృష్ణా జిల్లా జగ్గయ్యపేట ఐకాస ఆధ్వర్యంలో పెనుగంచిప్రోలులో ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య, ఐకాస నాయకులు ర్యాలీగా వచ్చి.. తిరుపతమ్మ అమ్మవారి ఆలయంలో పూజలు చేశారు. అమరావతిని తరలించవద్దని ప్రార్థిస్తూ అమ్మవారికి వినతి పత్రం అందజేశారు.

తెనాలిలో అమరావతి కోసం జేఏసీ దీక్ష

మన రాజధాని అమరావతి అనే నినాదంతో గుంటూరు జిల్లా తెనాలి మార్కెట్ సెంటర్​లో అఖిలపక్ష జేఏసీ ఆధ్వర్యంలో 17వ రోజు నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి. జై అమరావతి సేవ్ అమరావతి అనే నినాదంతో పతంగులు ఎగుర వేశారు. దీక్షా కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. సీఎం జగన్ ప్రాంతాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేందుకే... మూడు రాజధానుల ప్రతిపాదన చేశారని ఆరోపించారు. చిలకలూరిపేట మండలం నాగభైరవ వారి పాలెంలో అమరావతి ముద్దు మూడు రాజధానులు వద్దు అంటూ గ్రామస్తులు ఆందోళన చేశారు. సంక్రాంతి పురస్కరించుకుని వివిధ ప్రాంతాల నుంచి గ్రామానికి వచ్చినవారు సైతం ఆందోళనలో పాల్గొన్నారు. రాజధానిని మార్చొద్దని నినదించారు.

ఇదీ చదవండి:

అమరావతిపై భాజపా స్వరం.. ఈటీవీ భారత్​కు ప్రత్యేకం

పెనుగ్రంచిపోలులో జేఏసీ ర్యాలీ

మూడు రాజధానులు వద్దు అమరావతి ముద్దు అంటూ కృష్ణా జిల్లా జగ్గయ్యపేట ఐకాస ఆధ్వర్యంలో పెనుగంచిప్రోలులో ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య, ఐకాస నాయకులు ర్యాలీగా వచ్చి.. తిరుపతమ్మ అమ్మవారి ఆలయంలో పూజలు చేశారు. అమరావతిని తరలించవద్దని ప్రార్థిస్తూ అమ్మవారికి వినతి పత్రం అందజేశారు.

తెనాలిలో అమరావతి కోసం జేఏసీ దీక్ష

మన రాజధాని అమరావతి అనే నినాదంతో గుంటూరు జిల్లా తెనాలి మార్కెట్ సెంటర్​లో అఖిలపక్ష జేఏసీ ఆధ్వర్యంలో 17వ రోజు నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి. జై అమరావతి సేవ్ అమరావతి అనే నినాదంతో పతంగులు ఎగుర వేశారు. దీక్షా కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. సీఎం జగన్ ప్రాంతాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేందుకే... మూడు రాజధానుల ప్రతిపాదన చేశారని ఆరోపించారు. చిలకలూరిపేట మండలం నాగభైరవ వారి పాలెంలో అమరావతి ముద్దు మూడు రాజధానులు వద్దు అంటూ గ్రామస్తులు ఆందోళన చేశారు. సంక్రాంతి పురస్కరించుకుని వివిధ ప్రాంతాల నుంచి గ్రామానికి వచ్చినవారు సైతం ఆందోళనలో పాల్గొన్నారు. రాజధానిని మార్చొద్దని నినదించారు.

ఇదీ చదవండి:

అమరావతిపై భాజపా స్వరం.. ఈటీవీ భారత్​కు ప్రత్యేకం

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.