'రాజధానిని కట్టి చూపిస్తాం'.. ఈటీవీ భారత్తో కన్నా - భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ
ముఖ్యమంత్రి అనుభవరాహిత్యం, నియంతృత్వ ధోరణి వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. అమరావతి విషయంలో జగన్మోహన్రెడ్డి చేసిన ప్రకటన వెనక్కు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాజధాని వ్యవహారంపై త్వరలోనే పార్టీ తరపున పోరుబాటపడతామని వెల్లడించారు. అధికార పార్టీ నేతల వ్యాఖ్యలు, జనసేనతో చెలిమి, భాజపా రాజకీయ కార్యాచరణ అంశాలపై ఈటీవీ భారత్తో కన్నా లక్ష్మీనారాయణ ముచ్చటించారు.